
Rangoli in front of House
1. ముగ్గు ఎందుకు వేస్తాం?
మన ఇళ్ల ముందు ముగ్గు వేయడం అనేది ఒక సంప్రదాయమైన ఆచారం మాత్రమే కాదు, శాస్త్రపరంగా కూడా గొప్ప అర్థాన్ని కలిగి ఉంది. ప్రతి ఉదయం బియ్యం పిండి తో ముగ్గు వేయడం వలన చీమలు, ఈగలు, మరియు ఇతర చిన్న కీటకాలకు ఆహారం అందుతుంది. ఇది ప్రకృతికి మానవ సేవ చేయడమే.
మరొక ముఖ్య కారణం ఏమిటంటే, ముగ్గు వేయడం సమయంలో ఆడవారు వంగడం వలన వారి కడుపు, ప్రోక్రియేటివ్ సిస్టమ్, మరియు నడుము సంబంధిత ఆరోగ్య సమస్యలకు ఉపశమనంగా ఉంటుంది. ఇది ఒక రకమైన రోజువారీ వ్యాయామంగా మారుతుంది.
అతిథి దేవో భవః — అంటే మన ఇంటి వద్దకు వచ్చే అతిథి దేవుడిని సమానంగా చూడాలి. ఈ భావాన్ని మాటలతోనే కాదు, ఆచరణలో కూడా చూపిస్తాం ముగ్గుతో. ఇంటి ముందు చక్కటి ముగ్గు వేయడం ద్వారా ఆతిథ్యం, ఆహ్వానం అనే భావాన్ని వ్యక్తపరుస్తాం.
ముగ్గుకు ఎన్నో పేర్లు:
ప్రతీ ప్రాంతంలో దీన్ని వేర్వేరు పేర్లతో పిలుస్తారు:
- రంగోలి — ఉత్తర భారతదేశం
- రంగవల్లి — కర్నాటక
- పూకలం — కేరళ
- చౌకుపురానా — మధ్యప్రదేశ్
- మదన — రాజస్థాన్
- అరిపన — బీహార్
- అల్పన — బెంగాల్
- కోలం — తమిళనాడు
ఇలా, ముగ్గు అనేది భారతీయ సంస్కృతి, సాంప్రదాయం, శాస్త్రం, ప్రకృతి పరిరక్షణ మరియు ఆతిథ్య భావాల కలయిక.
Related Stories:
అన్ని హిందూ పండగలకన్నామకర సంక్రాంతి ఎందుకు భిన్నమైంది? | Sankranti Importance
Shani Jayanthi 2025 | శనిజయంతి రోజు ఈ పనులు చేస్తే శుభ ఫలితాలు ఖాయం
తులసి వివాహం | Tulsi Vivah 2025 Date, Puja Vidh, Significance & Story
గుడిలో కొబ్బరికాయను కొట్టడంలో ఉన్న నియమాలు.. | Significance of breaking coconut in temple
Good valuable information receiving through this site.
Recently I visited tirupathi.
I wish to know the importance of viewing vimana venkateshwara swamy darshan after darshan in main temple.
My friend told to visit first tiruchannur amma various temple at tirupathi and then to proceed for Balaji darshan at tirumal. Is it correct?
Good information sir