
Stories of Vaikuntha Ekadashi, Paramardha & Spiritual Inspiration
1వైకుంఠ ఏకాదశి ఏమి సూచిస్తుంది?
“Hariome” ను ఆదరిస్తున్న మిత్రులకు అభినందనలు. ఈ రోజు వరకు మన హరిఓం ద్వార మీకు మంచి సమచారాన్ని అందించడం జరిగింది. భవిష్యత్లో మీకు మరింత చేరువవ్వడం కోసం “Hariome” కొత్త ‘WhatsApp‘ ఛానెల్ ని ప్రారంభించడం జరిగింది. దేవాలయాల సమాచారం, పండుగల సమాచారం, ధర్మ సందేహాలు, ఆధ్యాత్మికం & పూజా విధానాలు వంటి సంచారం కోసం మా ఛానెల్ ని అనుసరించండి.
https://whatsapp.com/channel/0029VaAdPpAB4hdJqbRpuf1j
ఒక సంవత్సరంలో వచ్చే 24 ఏకదశుల్లో ఇది అతి పవిత్రమైన ఏకాదశి. సౌరమాసం, ప్రశస్తమైన ధనుర్మాసం (మర్గశిర/పుష్య మాసం)లో వచ్చే శుక్ల పక్ష ఏకాదశినే “వైకుంఠ ఏకాదశి”గా పిలుస్తాము. ఈ ఏకాదశిని “ముక్కోటి ఏకాదశి” అని కూడ పిలుస్తాము. ధనుర్మాసం సౌర మాసంలో వస్తుంది. ఇందులో వచ్చే వైకుంఠ ఏకాదశి చాంద్రమానాన్ని అనుసరిస్తుంది. శ్రీ మహావిష్ణువుకు సూర్యుడు కుడి కన్ను కాగా, చంద్రుడు ఏడమ కన్ను. దీని పరమార్ధం ఏమిటంటే కన్నులు వెర్వేరుగా ఉన్న చూపు ఒకటే అని చెప్తుంది. అంటే సూర్యచంద్రులు వేర్వేరు అయిన కాంతితత్వం ఒక్కటే. అందుకె సౌర మాసంలో చాంద్రమానం వస్తుంది కాబట్టే ఈరోజుకి అంతటి మహాత్యం.
వైకుంఠ ఏకాదశి ఏందుకు జరుపుకుంటాము? పురాణ గాధ (Why Do We Celebrate Vaikuntha Ekadashi? Epic Story)
వైకుంఠ ఏకాదశి మొదటి కథ (Vaikuntha Ekadashi First Story)
వైకుంఠ ఏకాదశి మార్గశిర పుష్య మాసంలో వస్తుంది. దేవతలు త్రేత యుగంలో రావణాసురుడి పెట్టే కష్టాలు తట్టుకోలేక బ్రహ్మ దేవుడు తోడు రాగా శ్రీమన్నారాయునికి మోర పెట్టుకోవడానికి వైకుంఠం చేరుకోని ఉత్తార ద్వారం గుండా లోనికి ప్రవేశించి తమ భాధను విన్నవించుకుంటారు. స్వామి వారు బ్రహ్మాది దేవతలకు అభయ హస్తంతో దర్శనం ఇచ్చి వారి భాధలకు మార్గం చూపిస్తాడు. ఇదంతా జరిగింది వైకుంఠం నందు ఏకాదశి రోజు. అందుకే దీనికి వైకుంఠ ఏకాదశి అని పేరు వచ్చింది.
రెండవ కథ (మోక్ష ఏకాదశి అనే పేరు ఏలా వచ్చింది?) (How Did the Name Moksha Ekadashi Come About?)
మధుకైటభులు అనే రాక్షసులను శ్రీమన్నారాయుడు సంహరించగానే వారి పాపాలు పోయి దివ్యజ్ణానాన్ని పొంది ఒక వరం కోరుకుంటారు. “స్వామి, వైకుంఠం లాంటి ఒక మందిరం నిర్మిస్తాము. వైకుంఠ ఏకాదశి రోజు మీ ఆలయంలోకి ఏ భక్తులైతే ఉత్తర ప్రవేశ ద్వారం నుంచి ప్రవేశించి మిమ్మల్ని దర్శించి ఏకాదశి పూజ చేస్తారో వారికి వైకుంఠ ప్రాప్తి అనుగ్రహించండి అని కోరుకుంటారు. శ్రివారు వార్కి కోరికకు సంతషించి తధాస్తు అని అంటాడు. వైకుంఠ ఏకాదశి రోజె మధుకైటభులకు మోక్షం వచ్చింది కాబట్టి మోక్ష లేద మోక్షోత్సవ ఏకాదశి అని కూడ పిలుస్తారు.
వైకుంఠ ఏకాదశికి గల వివిద పేర్లు (Vaikuntha Ekadashi Has Different Names)
1. ముక్కోటి (33 కోట్లు) దేవతల భాధలను ఏకాదశి రోజు తొలగించాడు కాబట్టి “ముక్కోటి ఏకాదశి” అని కూడా పిలుస్తారు.
2. దేవతలకు వైకుంఠ దర్శన భాగ్యం కలిగించింది కనుక వైకుంఠ ఏకాదశి.
3. భగవత్ దర్శనం కలిగించేది కనుక భగవదవలోకన దినం.
4. మొక్షాన్ని ప్రసాదించేది కనుక మోక్షదైకాదశి.
5. పుత్ర ప్రాప్తిని ప్రసాదించేది కనుక పుత్రదైకాదశి.
వైకుంఠ ఏకాదశి ఉపవాస నియమాలు (Vaikuntha Ekadashi Fasting Rules)
1. ఈరోజు తప్పక ఉపవాసం చేయాలి.
2. పాపకృత్యాలకు దూరంగా ఉండాలి.
3. సకల భోగాలను వదిలి పుణ్య కార్యక్రమాలు చేయాలి.
4. ఇంద్రియాలను, మనస్సును ఆదీనంలో పెట్టుకోని భగవంతున్ని స్మరిస్తూ ఉండాలి.
5. ఉపవాసం దశమి రాత్రి ప్రారంభమై ద్వాదశి ఉదయంతో పూర్తి అవుతుంది.
6. ఏనిమిది లోపు పిల్లలు, ఏనభై దాటిన వృద్దులు ఉపవాసం చేయకపోయిన పరవలేదు అని పురణాలు చెబుతున్నాయి.
ఏకాదశీ దేవి కథ (Story of Ekadasi Devi)
కృతయూగంలో మురుడు అనే చంద్రావతీ దేశాన్ని పాలిస్తుండేవాడు. దేవతలను యుద్దంలో ఓడించి వారిని అష్టకష్టాలు పెట్టేవాడు. శ్రీమహావిష్ణువు ఆ రాక్షసుడితో వెయ్యి సంవత్సరాలు యుద్దం చేసి చివరకి అలసిపోయి ఒక గుహలో విశ్రాంతి తీసుకున్నాడు. ఆ సమయంలో మురుడు స్వామివారిని సంహరించడానికి ఆ గుహలోకి వస్తాడు. అప్పుడే స్వామి వారి నుంచి ఒక దివ్య తేజస్సులతో ఒక కన్య ఉద్బవించి తన దివ్యస్త్రాలతో ఆ రాక్షసునితో రణం చేసి సమ్హరిస్తుంది. అప్పుడు స్వామి వారు సంతషించి వరం కోరుకోమన్నాడు. అప్పుడు తను “నేను ఈరోజు అనగా ఏకదశి నాడు మీ తేజస్సుతో ఉద్భవించాను కాబట్టి నా పేరు ఏకదశిగా నామకరణం చేయండి. ఈరోజు వ్రతం, ఉపవాసం చేసే భక్తులకు అంతా శుభమే కలిగేలా వరమివ్వమని అడిగింది.” ఇలా చాలా చాలా మంది ఈ వ్రతాన్ని ఆచరించారు. అందులో కొందరు వీరే,
1. పద్మ పురాణం ప్రకారం, సుకేతుడు అనే మహారాజు విశ్వేదేవతల ఉపదేశానుసారం పుష్య శుక్ల ఏకాదశీ వ్రతం చేసి భవదనుగ్రహాం సంపదించాడు.
2. వైకుంఠ ఏకాదశి రోజే దేవదానవులు ఉపవాసం ఉండి రాత్రి పగలు తేడా లేకుండా క్షీర సాగరాని మధించారు. అప్పుడే ద్వాదశి నాడు శ్రీమహాలక్ష్మి సముద్రం నుంచి వెలుబడింది.
3. కుచేలుడు ఏకాదశీ వ్రతం ఆచరించి మహైశ్వర్యవంతుడు అయ్యాడు.
4. ధర్మరాజు కష్టాల నుండి భయటపడ్డాడు.
5. రుక్మాంగదుడు పుత్ర ప్రాప్తి కలిగి సకల దేవాతా కృప పాత్రుడయాడు.
6. వైఖాస రాజు పితరులకు ఉత్తమ లోక ప్రాప్తి చేకూర్చాడు.
7. అంబరీషుడు జగద్విదితం అయ్యాడు.
వైకుంఠ ఏకాదశిలో గల ఆధ్యాత్మిక స్పూర్తి (Spiritual Inspiration in Vaikuntha Ekadashi)
వైకుంఠ ఏకాదశిలో రెండు పదాలున్నాయి. అవి వైకుంఠ, ఏకాదశి. వైకుంఠం అనేది విష్ణువు అని, ఆయన ఉండే స్థానం అని అర్ధం. సకల జీవ ప్రాణ కోటి యొక్క సాక్షి భూతముల స్వేచ్చ విహారాని అనిచివేసేవాడు అని అర్ధం.
వైకుంఠం అంటే పరమధామం. ఏకాదశి అనేది 11 ఇంద్రియాల సమూహం. ఈ 11 ఇంద్రియాలు వైకుంఠానికి అర్పించబడి, అర్చింది, సేవించి, ఉపాసించినప్పుడే అవి పవిత్రమై సుఖానుభుతిని పొంది ఆ జీవుణ్ణి వైకుంఠానికి చేరుస్తాయి. వికుంఠమంటే దెబ్బతిననిది అని అందుకే ఇంద్రియాలు వికుంఠాలు అయినప్పుడే వైకుంఠసమార్చన ప్రశాంతంగా జరుగుతుంది.
Next Coming Important Days
ధనుర్మాస వ్రత విధానం & నియమాలు | Dhanurmasa Vratham Puja Vidhi & Rules
కలియుగ వైకుంఠం తిరుమలలో వైకుంఠ ఏకాదశి ఎలా జరుగుతుంది? | How Vaikuntha Ekadashi Celebrate in Tirumala
Gita Jayanti 2025 | గీతా జయంతి ఎప్పుడు, ప్రాముఖ్యత, పూజ విధానం, భగవద్గీత ఏం చెబుతోంది?
Vaikunta Ekadasi 2025 Telugu | వైకుంఠ ఏకాదశి తేదీ, పూజా విధానం & ఉపవాస నియమాలు
Vaikunta Ekadasi Significance | వైకుంఠ ఏకాదశి ప్రాముఖ్యత & పాటించవలసిన ముఖ్య నియమములు ఏమిటి?
Matsya Dwadashi 2025 | మత్స్య ద్వాదశి విశిష్టత, పూజా విధానం & వ్రత కథ
Datta Jayanti 2025 | దత్త జయంతి, మాహాసిద్ధుడైన దత్తాత్రేయుని చరిత్ర
Annapurna Jayanti 2025 | అన్నపూర్ణ జయంతి ప్రాముఖ్యత, కథ & ఆచారాలు
Sankashtahara Chaturthi 2025 | సంకష్టహర చతుర్థి, ప్రాముఖ్యత, పాటించవలసిన ముఖ్య నియమములు ఏమిటి?