
Jambavantha Life Story in Ramayan
జాంబవంతుడు ఇప్పుడు కూడ నివసిస్తున్న ప్రదేశం వివరాలు
రామాయణంలో శ్రీరాముడు, సీతాదేవి, ఆంజనేయుడు, రావణుడు ఇలా చాలా ముఖ్యమైన పాత్రలు ఉన్నాయి. జాంబవంతుడిది కూడ చాలా ముఖ్యమైన పాత్ర. ప్రస్తుతం జాంబవంతుడు ఇంకా జీవించి ఉన్నారు అని పుకార్లు వినిపిస్తున్నాయి. జాంబవంతుడు అనగానే అందరికీ ఎలుగుబంటి అని గుర్తుకు వస్తుంది. మహాభారతంలో జాంబవంతుడు గురించి ఉంటుంది. శ్రీరాముడు, రావణుడు, ఆంజనేయుడు కంటే శక్తివంతమైన వారు జాంబవంతుడు. ఒంటిచేత్తో లంకాధిపతి చంపే శక్తి ఉన్నవాడు. జాంబవంతుడు రావణుడిని చంపే అవకాశం ఉన్నా రాముడు రావణుడిని చంపాలని అనుకున్నాడు కాబట్టి రాముడు కోసం అవకాశం వదిలేశారు. శ్రీరాముని అనుగ్రహంతో జాంబవంతుడు 10 వేలకు పైగా సింహాల బలాన్ని పొందారు. హనుమాన్ కి తన బలం పరిచయం చేసిన వారు జాంబవంతుడు.
మహాభారతంలో కృష్ణుడుపై జాంబవంతుడు యుద్ధం చేశాడు. యుద్ధంలో తాను ఓడిపోయిన తర్వాత శ్రీ కృష్ణుడికి తన కుమార్తెని ఇచ్చి పెళ్లి చేశారు. హిందూ పురాణాల ప్రకారం, జాంబవంతుడు విష్ణువు కల్కి అవతారం కోసం ఎదురు చూస్తున్నాడు. దుర్మార్గులను సంహారం కోసం కల్కితో పోరాటం కోసం జాంబవంతుడు ఎదురుచూస్తున్నట్లు చెప్పబడినది. జాంబగడ్ అనే రహస్య గుహలో జాంబవంతుడు సజీవంగా ఉన్నారు కొంతమంది నమ్మకం. మరికొంతమంది గుజరాత్లోని ఒక రహస్య గుహలో ఉన్నట్లు సమాచారం.
Related Posts
దిష్టి తగలకుండా ఉండాలంటే మీ ఇంట్లో గణపతిని ఇలా పెట్టుకోండి.| Shubha Drishti Ganapathi
వినాయక చవితి పూజలో వాడే 21 పుజా పత్రాలు & విశిష్ఠత | Vinayaka Chavithi 21 Patri Names in Telugu