పేదవాడి గురుదక్షిణ (ఈ రోజు కధ) | Story of Gurudakshina in Telugu

1
6857
Gurudakshina of a student
పేదవాడి గురుదక్షిణ (ఈ రోజు కధ) | Story of Gurudakshina in Telugu

పేదవాడి గురుదక్షిణ (ఈ రోజు కధ) | Story of Gurudakshina in Telugu

ప్రాచీన కాలం లో మన దేశం లో గురుకుల వ్యవస్థ ఉండేది.  పంజరపు చిలుకల్లాగా బట్టీ పాఠాలు నేర్చునే ఇప్పటి అనారోగ్యకరమైన విద్యావిధానాలు ఏర్పడకముందు జ్ఞానం స్వేచ్ఛనుండీ లభించేది.

సేవ,ప్రేమ,కృతజ్ఞత,పెద్దలపట్ల గౌరవం, మంచి నడవడిక, స్వంతంగా ఆలోచించగలిగే పరిపక్వత అన్నీ గురుకులం లో విద్యార్థులు సహజంగా నేర్చుకునేవారు.

వేలకు వేలు డబ్బులు గుంజే ఇప్పటి విద్యా సంస్థల్లా కాకుండా ఒకప్పుడు చదువు ఉచితంగా చెప్పేవారు. విద్యాభ్యాసం ముగిశాక విద్యార్థులు తమ శక్తి కొద్దీ గురుదక్షిణ సమర్పించుకునే వారు.

ఆ కాలం లో సత్ప్రవర్తనకు, మాట నిలబెట్టుకోవడానికి ఉన్న ప్రాధాన్యత తెలిపేదే ఈ కథ.

4. రఘు మహారాజు ఏమి చేశాడు ?

తన ధనాగారం లో ధనం నిండుకుందని తెలిసిన రఘుమహారాజు దేవేంద్రునిపైకి దండెత్తాడు. అమిత పరాక్రమ వంతుడు మాహామహుడు అయిన రఘుమహారాజు ధనం కొరకు తనపైకి దండెత్తవచ్చాడని తెలుసుకున్న దేవేంద్రుడు భయ భక్తులతో ఆయన ధనాగారాన్ని అంతులేని ధనరాశులతో నింపేశాడు.

ధనాగారం నిండినదని తెలుసుకున్న రఘుమహారాజు దండయాత్రను విరమించుకున్నాడు. రఘుమహారాజు కౌత్సుకుని ఆ ధనం తీసుకుని గురుదక్షిణ చెల్లించ వలసిందిగా కోరాడు.

కౌత్సుకుడు తనకు ఇంత ధనం అవసరం లేదని కేవలం 14 రాశులు చాలని, 14 రాశుల ధనాన్ని తీసుకు వెళ్ళి గురుదక్షిణ చెల్లించుకున్నాడు.

రఘుమహారాజు కూడా తన మాట చెల్లించుకోవడానికి మాత్రమే దండెత్తాడు కనుక మిగిలిన ధనం అక్కరలేదని దేవేంద్రునికి పంపించి వేశాడు.

Promoted Content

1 COMMENT

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here