
Why Green Camphor applied to Tirumala Venkateswara
1వెంకటేశ్వర స్వామికి గడ్డం మీద కర్పూరం ఎందుకు ఉంటుంది?
ఆంధ్రప్రదేశ్లోని చిత్తూరు జిల్లా తిరుపతి పట్టణంలోని తిరుమలలో శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ఆలయం ఉంది. శ్రీ వెంకటేశ్వర స్వామి దర్శనానికి ప్రతిరోజూ భక్తులు వేల సంఖ్యలో దర్శించుకుంటారు. భక్తులు శ్రీవారికి ముడుపులు, కానుకలు సమర్పించుకుంటారు. భక్తులు మొక్కులు తీర్చికోవడానికి తిరుపతికి కాలినడకపై గోవిందా గోవిందా అనే నామాన్ని పలుకుతూ మెట్ల ద్వార చేరుకోని శ్రీవారిని దర్శించుకుంటారు. ఏడు కొండలు మీద కొలువై ఉన్న శ్రీవారి గురించి చెప్పాలంటే మాటలు సరిపోవు. అంతటి విశిష్టత కలిగిన శ్రీవారికి గడ్డం కింద పచ్చ కర్పూరంతో అలంకరిస్తారు. దానికి కారణం ఏమిటో తెలుసుకుందాం.
శ్రీవారికి గడ్డం కింద పచ్చ కర్పూరంతో అలంకరించడానికి వెనక ఉన్న కథ ఏమిటి?! (What is the Story Behind Adorning Srivari’s Chin With Green Camphor?!)
శ్రీవారికి ఇష్టమైన భక్తుడు అనంతాళ్వారు. అనంతాళ్వారు శ్రీవారి కొండ వెనుక భాగంలో నివసించేవాడు. అతను ప్రతిరోజూ స్వామివారికి భక్తి శ్రద్ధలతో స్వయంగా పూలమాలలు అల్లి సమర్పించేవాడు. ఒక రోజు పూలతోటను పెంచాలని నిర్ణయించుకుంటారు. పూలతోట పెంపకానికి నీరు కోసం ఒక చెరువు కావాలి అని గ్రహించి త్రవ్వాలని నిర్ణయించుకొని మొదలు పెడతాడు. ఇతరుల సాయం తీసుకోకుండా భార్యాభర్తలు కలిసి చెరువును త్రవ్వాలని నిర్ణయించుకున్నారు. చెరువు తవ్వే సమయంలో అనంతాళ్వారుని భార్య నిండు గర్భవతి. అతను మట్టిని తవ్వి ఇస్తే ఆమె గంపలోకి ఎత్తి దూరంగా పడేసేది. ఇది అంతా గమనించిన శ్రీ వెంకటేశ్వర స్వామి వారు ఆ భార్యాభర్తలకు సహాయపడాలని అనుకుని 12 సంవత్సరాల బాలుని రూపంలో వస్తాడు. గర్భిణిగా ఉన్న ఆమెకు సాయం చేస్తానని, మట్టిని కూడ నేను మోస్తాను అని చేపుతాడు. దానికి అనంతాళ్వారు ఒప్పుకోడు. కాని భార్య అంగీకరించడంతో స్వామి వారు సాయం చేస్తాడు. ఆమె భర్తకు తెలియకుండా మట్టి తట్టని తీసుకెళ్ళి బాలుడికి ఇస్తది.
భార్య మట్టితట్టని తీసుకెళ్ళి తొందరగా రావడం గ్రహించిన అనంతాళ్వారులు భార్యని ప్రశ్నించాడు. అప్పుడు బాలుడు సహాయం చేస్తున్నాడని చెప్తుంది. అనంతాళ్వారు కోపగించుకుంటారు. కోపంతో ఉన్న అనంతాళ్వారుల తన చేతిలో ఉన్న గునపాన్ని బాలుడి మీదకి విసురుతాడు. అది ఆ బాలుడు గడ్డానికి తగులుతుంది. దాంతో బాలుడు రూపంలో వచ్చిన శ్రీ వెంకటేశ్వర స్వామి వారు కనబడకుండా మాయం అయిపోతాడు.
ఆలయంలో పూజారులు స్వామివారి విగ్రహానికి గడ్డం వద్ద రక్తం కారటం గమనించి ఆ విషయాన్ని అనంతాళ్వారుకు చెప్తారు. అతడు ఆలయానికి చేరుకోని శ్రీవారి గడ్డం నుండి రక్తం కారడం చూసి భయపడతాడు. మాకు సాయం చేయడానికి వచ్చిన బాలుడు శ్రీ వెంకటేశ్వరస్వామి వారే అని గ్రహించి ఇంకా బాధపడతారు. శ్రీవారి పాదాలపై పడి మన్నించమని కోరుకుంటాడు. గాయం వలన కలిగే బాధనుండి ఉపసమయం పొందడానికి గడ్డం దగ్గర పచ్చకర్పూరం పెడతారు. అప్పటి నుండి శ్రీవారి గడ్డం కింద పచ్చకర్పూరంతో అలంకరించడం అనవాయితాగా వస్తుంది. శ్రీవారిని గాయపరిచిన గునపాన్ని చూడాలనుకుంటే దేవాలయంలోని కుడివైపు గోడకు ఇప్పటికి వేలాడుతూ ఉండడం చూడవచ్చు.
Related Posts
https://hariome.com/rare-adhika-sravana-maas-after-19-years-these-works-are-prohibited-dont-do-it/
పూజ సమయంలో దీపం పెట్టడానికి గల ముఖ్యమైన నియమాలు| Rules for Lighting Lamp at Puja Time
శ్రావణ మాసంలో జమ్మి మొక్క దగ్గర దీపం పెడితే కలిగే ప్రయోజనాలు ఏమిటి?! | Shami plant
అధికమాసం అంటే ఏంటి? ఎందుకు? చేయాల్సిన పనులు? ఎప్పటి నుంచి ఎప్పటి వరకు?| Adhika Masam 2023
ఆలయంలో దేవుడి దర్శన సమయంలో తప్పక పాటించవలసిన నియమాలు | Rules To Follow for God Darshan in Temples
శ్రీ రామచంద్రుడి నుంచి నేర్చుకోవలసిన మేనేజ్మెంట్ స్కిల్స్ ఇవే! | Management skills from Rama.
ఆలయానికి ఏ వస్తువులను దానం చేయడం వల్ల ఎలాంటి ఫలితాలు కలుగుతాయి?! | Donation Results in Temple
కాలికి నల్ల దారం ధరించడం వల్ల కలిగే లాభాలు ఏంటి?! | Benefits of Wearing Black Thread