శ్రీ కృష్ణ భగవానుడు భగవద్గీత రూపంలో అర్జునునికి ఎన్నో విషయాలను బోధించాడు. భగవద్గీత అర్జునికి మాత్రమే కాకుండా ప్రపంచ ప్రజలందరికీ అపురూపమైన జ్ఞానభాండాగారం వంటిది. శ్రీకృష్ణుడు పాండవ పక్షపాతి అంటారు, నిజానికి ఆయన ధర్మ పక్షపాతి. పాండవులు ధర్మానికి కట్టుబడ్డారు కనుక శ్రీకృష్ణుడు వారిని ఆదరించాడు. పాండవులకు ప్రతి కష్టం లోనూ కృష్ణపరమాత్ముడు వెన్నంటే ఉన్నాడు. వారికి ఎన్నో విషయాలను సమయానుకూలంగా బోధించాడు. అటువంటి వాటిలో కొన్ని..
5. తేనె మీ సంపదలను పెంచుతుంది
పూలు – సృష్టిలో అత్యంత సౌందర్యవంతమైనవి. భగవంతుని పూజకి పూలు ప్రథమద్రవ్యం. అటువంటి పూలలోని మకరందాన్ని తేనెటీగలు సేకరించి తేనెను తయారుచేస్తాయి. పూల మొక్కలోని ఔషధ గుణాలన్నీ తేనెటీగలు సేకరించిన తేనెలో నిండి ఉంటాయి. ప్రకృతియొక్క శక్తిని తేనె ప్రతిబింబిస్తుంది. తేనె పరిసరాలలోని హానికారకాలను తొలగిస్తుందని, తేనెను తినడం వలన ఆరోగ్యం, బలం వృద్ధి చెందుతాయని శ్రీకృష్ణుని ఉవాచ.
శ్రీ కృష్ణుడు మనకు ఆదర్శం | Lord Krishna Greatness in Telugu