శ్రీ కృష్ణ భగవానుడు భగవద్గీత రూపంలో అర్జునునికి ఎన్నో విషయాలను బోధించాడు. భగవద్గీత అర్జునికి మాత్రమే కాకుండా ప్రపంచ ప్రజలందరికీ అపురూపమైన జ్ఞానభాండాగారం వంటిది. శ్రీకృష్ణుడు పాండవ పక్షపాతి అంటారు, నిజానికి ఆయన ధర్మ పక్షపాతి. పాండవులు ధర్మానికి కట్టుబడ్డారు కనుక శ్రీకృష్ణుడు వారిని ఆదరించాడు. పాండవులకు ప్రతి కష్టం లోనూ కృష్ణపరమాత్ముడు వెన్నంటే ఉన్నాడు. వారికి ఎన్నో విషయాలను సమయానుకూలంగా బోధించాడు. అటువంటి వాటిలో కొన్ని..
4. సరస్వతీ దేవి ప్రతిమ
ఇంట్లో సరస్వతీదేవి ప్రతిమ కానీ, సరస్వతీ స్వరూపమైన వీణకానీ ఉండటం వల్ల ఆ ఇంట్లో అజ్ఞానం, అపార్థాలు తొలగిపోతాయి. విద్యార్థులు విజయాన్ని సాధిస్తారు. ఎవరూ దోచుకోలేని ఒకేఒక్క ధనం విద్యాధనం. అటువంటి విద్యాధనం సరస్వతీదేవి ప్రతిమను పూజించే ఇంట్లో పుష్కలంగా ఉంటుందని శ్రీ కృష్ణుడు స్వయంగా సరస్వతీ ప్రాశస్త్యాన్ని చెప్పాడు.
Promoted Content