శ్రీ కృష్ణ భగవానుడు భగవద్గీత రూపంలో అర్జునునికి ఎన్నో విషయాలను బోధించాడు. భగవద్గీత అర్జునికి మాత్రమే కాకుండా ప్రపంచ ప్రజలందరికీ అపురూపమైన జ్ఞానభాండాగారం వంటిది. శ్రీకృష్ణుడు పాండవ పక్షపాతి అంటారు, నిజానికి ఆయన ధర్మ పక్షపాతి. పాండవులు ధర్మానికి కట్టుబడ్డారు కనుక శ్రీకృష్ణుడు వారిని ఆదరించాడు. పాండవులకు ప్రతి కష్టం లోనూ కృష్ణపరమాత్ముడు వెన్నంటే ఉన్నాడు. వారికి ఎన్నో విషయాలను సమయానుకూలంగా బోధించాడు. అటువంటి వాటిలో కొన్ని..
3. స్వచ్చమైన నెయ్యి ఐశ్వర్యాన్ని కలిగిస్తుంది
స్వచ్చమైన నెయ్యి పంచామృతాలలో ఒకటి. ఇది అత్యుత్తమమైన పూజా ద్రవ్యం. నేతితో చేసిన పదార్థాలను భగవంతునికి నివేదించడం శ్రేష్ఠం. ఆవునెయ్యి అనేక ఆయుర్వేద సుగుణాలను కలిగి ఉంటుంది. దానివలన అనేక రోగాలు నయమవుతాయి. శరీరం లో కొవ్వు చేరకుండా, బలాన్ని మాత్రమే చేకూర్చగల దివ్యౌషధం ఆవునెయ్యి. ఆవునెయ్యి లక్ష్మీదేవి రూపంగా మన సంప్రదాయకులు చెబుతారు. ఆవు నెయ్యిని వాడటం వలన ఆరోగ్య సిద్ధి, ధనప్రాప్తి కలుగుతాయి.