
Nine Ways Of Devotions in Telugu
10. ఆత్మనివేదనము
మన దగ్గరున్నవన్నీ సమర్పించేశాక మిగిలేది ఆత్మ ఒక్కటే అదే పరబ్రహ్మం. ఈ స్థితిలో భగవంతుడికి,భక్తునికి భేదంలేదు..ఇద్దరూ ఒక్కటే. సద్గురువుని ఆశ్రయించి…ఆయన్ని అనుసరించి..ఆయన భోదలే జీవితంగా మలచుకున్నవారు ఆయనే అవుతారు….ఇదే భ్రమరకీట న్యాయం..భ్రమరాన్నే చింతించిన కీటకం భ్రమరం అవుతుంది…ఇప్పుడు భక్తుడు సగుణరూపంలో ఉన్న భగవంతుడు అవుతాడు…సద్గురు మిలరేపా, సద్గురు ఎక్కిరాల భరద్వాజ మహరాజ్, సద్గురు సిద్ధప్ప ఇలాంటివారు గురువుగారిని ఆశ్రయించి, వారి ఉపదేశాలు ఆచరించి గురువులు అయ్యారు. ఈ స్థితిలో వారేమైనా చెయ్యగల సమర్ధులై తమ మార్గంలోకి ఎంతోమంది రావడానికి ప్రేరణ కలిగిస్తారు…జనన,మరణాల్ని జయించి ఎప్పటికీ జీవిస్తూ తమ భక్తుల,శిష్యుల బాగోగులు గమనిస్తూ వారికి సన్మార్గాన్ని చూపిస్తారు.
ఆధ్యాత్మికతలో గురువులు ఉపయోగించే పదాలన్నీ నిగూఢంగా వుంటాయి..తిరిగి తిరిగి దాన్ని అలోచిస్తేగానీ దాని లోతైన అర్ధం మనకి అర్ధంకాదు. పారాయణ ద్వారా నియమబద్ధమైన జీవితానికి అలవాటుపడుతూ..క్రమశిక్షణ కలిగివుండటం అలవాటుగా చేసుకోవాలి… నామం రాస్తూ పోవటం ద్వారా ఏకాగ్ర దృష్టి పెంచుకోవాలి….నామానికి, రూపానికి, గుణానికి అతీతమైన భగవంతుడు ధ్యానంలో మాత్రమే కనిపిస్తాడు, వినిపిస్తాడు. ధ్యానం చేస్తూ భగవంతుడికి దగ్గరవ్వాలి.మరి భగవంతుడిపై మనకి ప్రేమ కలగాలంటే ఏం చెయ్యాలి?? మహాత్ముల, భక్తుల, సద్గురువుల, వారి శిష్యుల జీవిత చరిత్రలు చదువుతూ వారు ఏ విధంగా చేసారో గమనిస్తూ…వాటిని ఆచరిస్తూ పోతే..మనం అన్నిటినీ ఒదులుకోవటానికి సిద్ధపడగానే భగవంతుడు అంతులేని ప్రేమ అనే సంపదని ప్రసాదిస్తారు.