
Important notification for Vikunta ekadashi at Tirumala
శ్రీవారి భక్తులకు అలెర్ట్
ధనుర్మాసం శుక్ల పక్ష ఏకాదశి రోజును వైకుంఠ ఏకాదశిగా పిలుస్తారు. తెలుగువారు ఈ పర్వదినాన్ని ముక్కోటి ఏకాదశి పేరుతో జరుపుకుంటారు. విష్ణు ఆలయాల్లో వైకుంఠ ఏకాదశి అత్యంత ఘనంగా నిర్వహిస్తారు. ఈ రోజున ఉత్తర ద్వారం ద్వారా స్వామివారిని దర్శించుకోవడం పుణ్యప్రదమైనదిగా భావిస్తారు. తిరుమలలో వైకుంఠ ఏకాదశి కోసం టీటీడీ విశేష ఏర్పాట్లు చేసింది. జనవరి 10 నుంచి 19 వరకు వైకుంఠ ద్వారం ద్వారా స్వామివారి దర్శనానికి వీలుచేసింది.
టీటీడీ తీసుకున్న ముఖ్య నిర్ణయాలు
- దేవదర్శనానికి టోకెన్ లేదా టికెట్ తప్పనిసరం
- టోకెన్లు లేదా టికెట్లు ఉన్న భక్తులకే స్వామివారి దర్శనానికి అనుమతి ఉంది. టోకెన్లు లేకపోతే దర్శనం లభించదని స్పష్టం చేశారు.
ప్రత్యేక దర్శనాలు రద్దు
- భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని, ఏడాది లోపు పిల్లలు, వృద్ధులు, దివ్యాంగులు, రక్షణ శాఖ సిబ్బంది, ఎన్ఆర్ఐలకు ఉండే ప్రత్యేక దర్శనాలను రద్దు చేశారు.
వీఐపీ బ్రేక్ దర్శనాలు రద్దు
- జనవరి 10 నుంచి 19 వరకు ప్రోటోకాల్ ప్రముఖులు మినహా అన్ని వీఐపీ బ్రేక్ దర్శనాలను రద్దు చేసినట్లు టీటీడీ ప్రకటించింది.
గోవిందమాల భక్తులకు ప్రత్యేక దర్శనం లేదు
- గోవిందమాల ధరించిన భక్తులకు ప్రత్యేక దర్శనం కల్పించరని, టోకెన్ లేదా టికెట్ ఉన్నవారికి మాత్రమే దర్శనం కల్పిస్తారు.
టైంస్లాట్ ప్రకారం క్యూలైన్లలోకి ప్రవేశం
- భక్తులు తమకు కేటాయించిన టైంస్లాట్ ప్రకారం క్యూలైన్ వద్దకు చేరుకోవాలని టీటీడీ సూచించింది.
మాజీ ప్రజాప్రతినిధులు, బ్యూరోక్రాట్ల దర్శనం
- జనవరి 10న వైకుంఠ ఏకాదశి రోజున మాజీ ప్రజాప్రతినిధులు, బ్యూరోక్రాట్లు, చైర్మన్లకు దర్శనానికి అనుమతి ఉండదు. అయితే జనవరి 11 నుంచి 19 వరకు వీరికి దర్శనానికి వీలుంటుంది.
సేవకుల నియామకం
- వైకుంఠ ద్వార దర్శనాల నిర్వహణ కోసం 3,000 మంది యువ శ్రీవారి సేవకులు, స్కౌట్స్ అండ్ గైడ్స్ సేవలను వినియోగించుకుంటున్నారు.
భక్తుల సౌకర్యార్థం విశేష ఏర్పాట్లు
- క్యూలైన్లో భక్తులు ఎక్కువ సమయం వేచి ఉండకుండా చర్యలు తీసుకుంటున్నారు. ఎక్కువ మంది భక్తులు వైకుంఠ ద్వార దర్శనం చేసుకునేలా ఏర్పాట్లు చేశారు.
భక్తులు టీటీడీ సూచనలు పాటించి, దర్శనం సాఫల్యంగా నిర్వహించేందుకు సహకరించాలని విజ్ఞప్తి.
Related Posts:
Tirumala Sevas Information | తిరుమల శ్రీవారికి నిత్య జరిగే సేవలు మరియు వాటి వివరాలు
Tirumala Donation Benefits | తిరుమలలో ఏ విరాళానికి శ్రీవారి ఏ దర్శనం లభిస్తుంది?