
4. హిందూధర్మ పరిరక్షణలో ఉజ్జయినీ మహానగరం
భర్తృహరి అనే మహారాజు ఇక్కడే గోరఖ్ నాధునివద్ద శిష్యరికం చేసి, లౌకిక సుఖాలను త్యజించి సన్యసించాడు. జడరూపుడనే మహాయోగి ఉజ్జయినీ నగరానికి చెందినవారు. 16వ శతాబ్దం లో వల్లభాచార్యుడనే వైష్ణవ ఆచార్యుడు ఉండేవాడు. వైష్ణవ సాంప్రదాయానికి చెందిన సభలను బైఠకాలు అని పిలిచేవారు. వల్లభాచార్యుడు వైష్ణవ సాందీపనీ ఆశ్రమం తరపున 84 వైష్ణవ సభలను(బైఠకాలు) నిర్వహించాడు. వాటిలో 73 వ సమావేశం ఉజ్జయిని లోని రావి చెట్టు కింద జరిగింది. ఇవి మాత్రమేకాదు ఉజ్జయినీ మహా నగరం లో హిందూ మతానికి చెందిన అనేకరకాల సంప్రదాయాలకు చెందిన వాళ్ళు మఠాలనూ, పీఠాలనూ ఇక్కడ స్థాపించుకున్నారు. ఇప్పటికీ ఉజ్జయినీ మహానగరం భక్త కోటికి ఆలవాలంగా అలరారుతోంది.
ఉజ్జయినీ లోని క్షిప్రా నదీ పూర్ణకుంభ పుష్కరాలు 22-04-2016 నుండీ 21-05-2016 వరకూ అత్యంత వైభవంగా జరుగుతున్నాయి.
Promoted Content