నేడు జగన్నాథుని రథయాత్ర | Puri Jagannath Rath Yatra in Telugu ?

0
1495

 

జగన్నాథుని రథయాత్ర
Puri Jagannath Rath Yatra in Telugu

Puri Jagannath Rath Yatra in Telugu

పూరీ నుంచి న్యూస్‌టుడే బృందం: బ్రహ్మాండ నాయకుని విశ్వప్రసిద్ధ రథయాత్రకు పూరీ శ్రీక్షేత్రం సిద్ధమైంది. శనివారం జగన్నాథుడు భక్త జనఘోష మధ్య బలభద్ర, సుభద్రలతో కలసి రథాలపై గుండిచా (పెంచినతల్లి) మందిరానికి చేరుకోనున్నాడు. ఈ యాత్ర తిలకించడానికి యాత్రికులు శుక్రవారమే పెద్ద సంఖ్యలో పూరీ చేరుకున్నారు. రథయాత్ర సాగే పెద్ద వీధి ఆవరణ పురుషోత్తమ నామస్మరణలతో ప్రతిధ్వనిస్తోంది. దేశ, విదేశాల నుంచి చేరుకుంటున్న భక్తులతో మఠాలు, ఆశ్రమాలు, ధర్మశాలలు, హోటళ్లు నిండిపోయాయి. స్నానయాత్ర (జ్యేష్ట పూర్ణిమనాడు) వేడుకలో జలక్రీడలాడిన చతుర్థామూర్తులు (జగన్నాథ, బలభద్ర, సుభద్ర, సుదర్శనులు) అస్వస్థతకులోనై పక్షం రోజులపాటు ఒనొసొనొ (చీకటి) మందిరంలో చేరిన సంగతి విధితమే. ఇక్కడ స్వామికి గోప్య చికిత్స, సేవలు జరిగాక ఆరోగ్యవంతుడై శుక్రవారం నవయవ్వన రూపంలో (నేత్రోత్సవం) భక్తులకు దర్శనమిచ్చారు. ఆషాఢ శుక్ల విదియనాడు (శనివారం) ముగ్గురు మూర్తులు నందిఘోష్‌, తాళధ్వజ, దర్పదళన్‌ రథాలపై గుండిచాదేవి మందిరానికి చేరుకుంటారు. అక్కడ తొమ్మిది రోజులు విడిది చేయనున్నారు.

జమల్‌పూర్‌ జగన్నాథునికి మోదీ కానుకలు
అహ్మదాబాద్‌: జమల్‌పూర్‌లోని జగన్నాథస్వామి ఆలయం నుంచి నేడు 141వ వార్షిక రథయాత్ర ప్రారంభం కానుంది. ఏటా రథయాత్ర సందర్భంగా కానుకలు పంపుతున్న ప్రధాని నరేంద్ర మోదీ… ఈ ఏడాది కానుకలను శుక్రవారం స్వామివారి చెంతకు చేరవేశారు. తన గురించి ఎవరికీ తెలియని రోజుల్లో మోదీ కొంతకాలం ఈ గుడిలోనే గడిపినట్లు ఆలయ ధర్మకర్తల మండలి సభ్యుడు మహేంద్ర ఝా తెలిపారు. రథయాత్రలో గుజరాత్‌ ముఖ్యమంత్రి విజయ్‌ రూపాని తదితర ప్రముఖులు పాల్గొంటారు.

Related Posts

పూరి జగన్నాథుని అసంపూర్ణ విగ్రహాలు మరియు రథం వెనుక ఉన్న రహస్యలు మీకు తెలుసా? | Puri Jagannath Rath Yatra 2025

శ్రీ జగన్నాథ రథయాత్ర ప్రాముఖ్యత, పాటించవలసిన ముఖ్య నియమములు? | Puri Jagannath Rath Yatra 2025

https://hariome.com/puri-jagannath-rath-yatra-2023/

Puri Jagannath Rath Yatra 2025 | పూరీ జగన్నాథ రథయాత్ర ప్రత్యేకతలు & ఆసక్తికరమైన నిజాలు

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here