
2. బ్రాహ్మణుని ప్రార్థన
పాండవులు అరణ్య వాసం లో భాగంగా ద్రౌపదీదేవి పురోహితుడయిన ధౌమ్యుని వద్దకు ద్వైత వనానికి వెళ్లారు. వారు చూస్తుండగా అటుగా ఒక జింక పరిగెడుతూ వెళ్లింది.
దానివెనుకే ఒక బ్రాహ్మడు పరిగెట్టుకుంటూ వచ్చాడు. పాండవులను చూసి ‘ అయ్యా నేను యాగార్థము అరణిని( నిప్పు పుట్టించే కొయ్య) తీసుకుని వచ్చి, దానిని పక్కన ఉంచి మిగిలిన పనులు చేస్తుండగా ఆ జింక అటుగా వెళ్లింది.
దాని కొమ్ములలో నా అరణి చిక్కుకున్నది. నా నిత్యకార్యానికి భంగం వాటిల్లకుండా దయచేసి ఆ అరణిని తెచ్చి పెట్టండి. అని అడిగాడు.
అతని మాటలు వినగానే పాండవులు విల్లంబులు చేతబట్టి ఆ జింకను వెంబడించారు.
Promoted Content