
3. సరస్వతీబాయి దానగుణం
అతను ఒక్క నాడు కూడా విఠలునికి దానం చేయలేదు. ఒకనాడు విఠలుడు ‘ ‘అయ్యా నేను నా కుమారునికి ఉపనయనం చేయదలచాను దయచేసి తృణమో పణమో ఇప్పించండి’ అని అడిగాడు.
విఠలుని పట్టుదలకు విసుగు చెందిన శ్రీనివాసనాయకుడు ‘ సరే నేను ఏమిచ్చినా మారు మాట్లాడకుండా తెసుకుని వెళ్లిపోవాలి. ‘ అన్నాడు. ఒక చెల్లని నాణాన్ని ఇచ్చి పంపించి వేశాడు.
బ్రాహ్మణ వేషం లోని విఠలుడు మళ్ళీ ఆ ఇంటికి వెళ్ళాడు. సరస్వతీబాయి అతనిని చూసి ఇందాకే కదా నా భర్త మీకు దానమిచ్చాడు మళ్ళీ ఎందుకు వచ్చారు?’ అని అడుగగా విఠలుడు ఆమె భర్త ఇచ్చిన చెల్లని నాణేన్ని చూపించాడు.
తన భర్త పిసినారితనానికి బాధ పడ్డ సరస్వతీబాయి ఆ బ్రాహ్మడికి ఎంతోకొంత ఇచ్చి పంపించాలని అనుకుంది.
Promoted Content