
మయూర ధ్వజుని పరోపకారం
పరోపకారం పరమధర్మం అని మనం వింటూనే ఉంటాం. కానీ ‘నేటి జీవన విధానం లో మన అవసరాలు తీరడమే గగనంగా మారుతున్న ఈ కాలం లో పరోపకారం సాధ్యపడుతుందా?’ అనుకునేవారికి మయూరధ్వజుని కథ స్ఫూర్తినిస్తుంది.
4. మయూరధ్వజుని త్యాగం
బ్రాహ్మణుని మాటలువిన్న మయూరధ్వజుడు ‘పరులకు ఉపకారం చేయడం కన్నా నా శరీరానికి ధన్యత ఎక్కడిది? తప్పకుండా నా శరీరం లోని సగభాగాన్ని తీసుకుని మీ కుమారుని రక్షించండి.
‘ అని తన భార్యా పిల్లలకు తనను సగభాగం చేసి వారికి ఇవ్వవలసిందిగా కోరాడు. మయూర ధ్వజుని త్యాగ నిరతి తెలిసిన ఆ పుణ్యాత్ములు లోలోపల కుమిలి పోతూనే అందుకు అంగీకరించారు.
ఆ కుటుంబం చేస్తున్న పనిని చూసి కృష్ణార్జునులు నిర్ఘాంతపోయారు. మయూరధ్వజుని ఎడమ కన్ను నుండీ నీరు రావడం గమనించిన శ్రీకృష్ణుడు అతని గొప్పదనాన్ని ప్రపంచానికి చాటాలని ఇలా అన్నాడు.
‘రాజా..! సంతోషంగా, సమ్మతంగా చేసేదే త్యాగం అవుతుంది. నీ ఎడమకంట కన్నీరు కారుతోంది. బాధ పడుతూ కీర్తి కాంక్ష కోసం చేసే దానం పరమ నీచమైనది.’ అన్నాడు.