
మయూర ధ్వజుని పరోపకారం
పరోపకారం పరమధర్మం అని మనం వింటూనే ఉంటాం. కానీ ‘నేటి జీవన విధానం లో మన అవసరాలు తీరడమే గగనంగా మారుతున్న ఈ కాలం లో పరోపకారం సాధ్యపడుతుందా?’ అనుకునేవారికి మయూరధ్వజుని కథ స్ఫూర్తినిస్తుంది.
3. కృష్ణార్జునుల మాయోపాయం
మయూరధ్వజుని పరోపకార గుణాన్ని గురించి తెలుసుకున్న వారిద్దరూ ఆనాటి సాయంకాలం విప్రవేశం(బ్రాహ్మణ వేషం) లో మయూరధ్వజుని వద్దకు వెళ్లారు.
వచ్చినవారిని మయూరధ్వజుడు సాదరంగా ఆహ్వానించాడు. వారిలో మారు వేషంలో ఉన్న శ్రీకృష్ణుడు మయూరధ్వజునితో ఇలా అన్నాడు.
“రాజా..! నీ సహాయం కోరి వచ్చాను. నీవుతప్ప నాకు దిక్కెవ్వరూ లేరు. ‘ అని అన్నాడు. అప్పుడు మయూరధ్వజుడు ‘బ్రహ్మణోత్తమా నా వలన నీకు ఎటువంటి సహాయమైనా లభిస్తుంది.
సంకోచించకుండా అడగండి. మీ కోరికను నెరవేర్చడం నా పరమధర్మం.’ అన్నాడు. అప్పుడు కృష్ణుడు ‘రాజా..! మార్గ మధ్యం లో నా కుమారుని ఒకపులి పట్టుకున్నది అది నా బిడ్డడి సగం శరీరాన్ని తిన్నది.
అతను కొనప్రాణములతో ఉన్నాడు. నీ శరీరం లోని సగభాగం ఇస్తే నా కుమారుడిని వాదులుతానని అన్నది. అందుకే నీ సహాయార్థం వచ్చాను.’ అన్నాడు.