
Saphala Ekadashi Importance
2సఫల ఏకాదశి వ్రతం యొక్క కథ (A Story & Rules of a Saphala Ekadashi Fasting):
చంపావతి అనే రాజ్యాన్ని మహిష్మత్ అనే రాజు పరిపాలిస్తూ ఉండేవాడు. ఆ రాజుకు 5 కుమారులు. ఆ 5గురు కుమారులలో రాజు పెద్ద కుమారుడు ధైర్యవంతుడు, అలాగె దుర్మార్గుడు కూడా అతని ప్రవర్తన మంచిగా ఉండేది కాదు. రాజు మరియు మిగిలిన కుమారులు రాజు పెద్ద కుమారుడికి లుంభక్ అని పేరు పెట్టారు. కొంత కాలం తరువాత, లుంభక్ యొక్క ప్రవర్తన చాలా రాక్షసంగా మారింది. ఒకరోజు రాజు పెద్ద కూమారుడు లుంభక్ దొంగతనానికి ప్రయత్నిస్తాడు. కానీ రాజు యొక్క భటులు అతన్ని పట్టుకుంటారు. అప్పుడు రాజు గారు అతన్ని రాజ్యం నుంచి పంపించేస్తారు. లంభక్ అడవిలో ఒక మర్రి చెట్టు కింద నివసించడం ప్రారంభించాడు. ఆ సమయంలో లుంభాక్ తన యొక్క అలవాట్లు తన జీవితాన్ని ఎలా నాశనం చేశాయో భాదపడుతూ, పాపాలు చేసినందుకు పశ్చాత్తాప పడ్డాడు. అనుకోకుండా ఏకాదశి తిథి రోజున, అతను ఒక చెట్టు కొన్ని పండ్లను తీసుకువచ్చి విష్ణువుకు సమర్పించాడు. అతనికి అవరు అఆహారం పెట్టెవారిన్ లేరు కాబట్టి రోజంతా ఆహారం తీసుకోలేదు. అతను తనకి తెలియకుండానే ఏకాదశి ఉపవాస చేసాడు, వ్రతాన్ని పాటించడం ముగించాడు. అలా లుంభక్ ప్రవర్తనలో మార్పు వచ్చింది. రాజుగారు లుంభక్ యొక్క పరివర్తన గురించి తెలుసుకుని తిరిగి రాజు గారు అతనిని తన వారసుడిగా ఒప్పుకున్నాడు. అలా లుంభక్ ఏకాదశి తిథి రోజున తనకు తెలియకుండా వ్రతం ఆచరించి గొప్ప ఫలితాన్ని పొందాడు.
మరిన్ని వివరాల కోసం పక్క పేజీలోకి వెళ్ళండి.