తల్లి తండ్రులకి పిత్రు కార్యం చేసినవారు ఒక సంవత్సరం (ఏటి మైలు) పాటు వారి గృహములో శుభకార్యం చేయరాదు. బంధువులకు, అన్నదమ్ములకు చేసినచో మూడు నెలల (త్రైమాసికము) పూర్తి అయ్యిన తర్వాత శుభకార్యములు చేసుకొనవచ్చును. తెలిసినవారికి లేదా అనాధలకు చేసినచో 45 రోజులు (త్రైపక్షికము) పూర్తి అయిన తరువాత వారి గృహములో శుభకార్యం చేసుకొనవచ్చును.