
Shree Jagannath Temple, Puri
1పూరీ జగన్నాథ దేవాలయం
ఉత్తర భారతదేశం ఒడిశా రాష్ట్రంలోని పూరీ పట్టణంలో అత్యంత ప్రసిద్ధమైనవి పూరీ జగన్నాథ ఆలయం ఉంది. పూరీ జగన్నాథ రథయాత్ర గురించి తెలియని హిందువులూ ఉండరు. పూరీ జగన్నాథ ఆలయంలో విగ్రహాలు చెక్కతో తయారు చేశారు. పూరీ జగన్నాథ ఆలయంలో శ్రీకృష్ణుడు, సుభద్ర, బలరామ సమేతంగా భక్తులకు దర్శనమిస్తాడు. జగన్నాథుడు జగత్ (విశ్వం), నాథ్ (ప్రభువు) అని అర్థం.
దేవాలయ మూలాలు (Puri Jagannath Temple History & Idols Story)
పూరీ జగన్నాథ ఆలయ నిర్మాణాన్ని కళింగ పరిపాలకుడైన అనంతవర్మన చోడగంగాదేవ గారు ప్రారంభించారు. జగన్మోహన, విమన భాగాలు అతని హయాం (సా.శ.1078 – 1148) లోని పూరీ జగన్నాథ ఆలయం నిర్మాణం పూర్తి అయ్యింది. ఒడిశా పాలకుడైన అనంగ భీమ్ దేవ సా.శ. 1174 లో పూరీ జగన్నాథ ఆలయం పునర్నిర్మించారు. ప్రస్తుతం ఉన్న పూరీ జగన్నాథ దేవాలయం 12 శతాబ్దంలో రాజా అనంతవర్మ చోడగంగదేవ్ నిర్మాణం ప్రారంభం చేసారు. ఆయన మనుమడు రాజా అనంగభీమదేవ్ నిర్మాణం పూర్తి చేసారు. స్థలపురాణం జగన్నాథుడు గిరిజనుల దేవుడని, నీలమాధవుడనే పేరుతో పూజ అందుకున్నారు. గిరిజనుల రాజైన విశ్వావసుడు అడవిలో ఓ రహస్య ప్రదేశంలో జగన్నాథుణ్ని పూజించేవాడట. ఇంద్రద్యుమ్న మహారాజు ఈ విషయం గురించి తెలిసి విద్యాపతి అనే బ్రాహ్మణ యువకుణ్ని అడవికి పంపుతాడు. విశ్వావసుడు కూతురు లలితను విద్యాపతి పెళ్లి చేసుకుంటాడు. విద్యాపతి పూరీ జగన్నాథ విగ్రహాన్ని చూపించమని అడుగుతారు. అల్లుడి కాదనలేని విశ్వావసుడి గంతలు కట్టి గుడి దగ్గరికి తీసుకువెళతాడు. దారిపొడుగునా ఆవాలు విద్యాపతి తెలివిగా జారవిడుస్తాడు.కొన్ని సంవత్సరాల తరవాత అవి మొలకెత్తి దారి స్పష్టంగా తెలుస్తుంది. విషయం తెలుసుకున్న రాజు వచేసరికి విగ్రహాలు మాయమవుతాయి. నిరాశతో నిరాహారదీక్ష మొదలుపెట్టి, అశ్వమేథయాగం ఇంద్రద్యుమ్నుడు చేస్తాడు. నరసింహ స్వామి విగ్రహాన్ని నీలాచలం మీద ఓ ఆలయాన్ని నిర్మించి ప్రతిష్ఠిస్తాడు. ఒక్క రోజు నిద్రిస్తుండగా, జగన్నాథుడు కలలో కనిపించి సముద్రతీరంలో చాంకీనది ముఖద్వారానికి వేప కొయ్యలు కొట్టుకొస్తాయనీ వాటితో విగ్రహాలు చేయించమనీ ఆదేశిస్తాడు. కానీ, విగ్రహ నిర్మాణానికి ఎవరూ ముందుకు రాలేదు. అప్పుడు దేవశిల్పి విశ్వకర్మ వికలాంగుడి రూపంలో వస్తాడు. రహస్యంగా ఓ గదిలో విగ్రహాలకు రూపకల్పన చేస్తాననీ మాట ఇస్తాడు. 21 రోజులు అటువైపు ఎవరూ రాకూడదు, పచ్చి మంచినీళ్లు కూడా ముట్టుకోననీ. తన పనికి ఆటంకం కలగకూడదని అని చెప్తాడు. గదిలోంచి ఎలాంటి శబ్దమూ రాదు. తొందర పెట్టండి గడువు పూర్తికాకుండానే రాజు తలుపులు తెరిస్తే.చేతులూ కాళ్లూ లేని, సగం చెక్కిన విగ్రహాలు మాత్రం దర్శనమిస్తాయి. మరిన్ని వివరాల కోసం తరువాతి పేజీలో చూడండి.