మహా భారతం లో కచ దేవయానుల కథ చాలా ప్రసిద్ధమైనది. అందులో భాగంగా దేవగురువు బృహస్పతి కుమారుడైన కచునికీ, దైత్య గురువు శుక్రాచార్యునికీ మధ్య జరిగిన కథ మనకు ఎన్నో గొప్ప విషయాలను చెబుతుంది. ఆ కథను తెలుసుకుందాం.
5. రాక్షసుల ఈర్ష్య
తమ గురువు వద్దకు వచ్చిన శత్రు పక్షం లోనివాడైన కచుడంటే రాక్షసులు మండిపడేవారు. తమ గురువు అతనిపై చూపించే వాత్సల్యాన్ని, అతని సద్గుణాలనూ, జ్ఞానాన్నీ, వినయాన్నీ చూసి అసూయతో రగిలిపోయేవారు.
ఎలాగైనా కచుడిని చంపేయాలని అనుకున్నారు. సమిధలకోసం అడవికి వెళ్ళి వస్తున్న కచుడిని దారిలో అడ్డగించి నిర్దాక్షిణ్యంగా హత్య చేశారు.
వేళ మించిపోయినా కచుడు ఆశ్రమానికి చేరుకోక పోయేసరికి అతని ధ్యాసలోనే ఉండే దేవయాని కీడు శంకించింది. తండ్రి వద్దకు వెళ్ళి కచుడు ఎన్ని అవాంతరాలు వచ్చినా సంధ్యా వందనం మానుకోడు.
అటువంటిది ఇవాళ వేళ మించిపోయినా ఇంకా అతను ఆశ్రమం చేరుకోలేదని చెప్పింది. దివ్య దృష్టితో కచుని గురించి తెలుసుకున్న శుక్రాచార్యుడు తన మృత సంజీవనీ విద్యతో అతనిని బ్రతికించాడు.