
Mysterious Temple of Where the Dead People Gets Alive Again For Some Time
1చనిపోయిన వారిని కొన్ని నిమిషాల పాటు బ్రతికించే దేవాలయం
చనిపోయిన వారిని కొన్ని నిమిషాలు బతికించగల దేవాలయం ఎక్కడ ఉందో తెలుసా..!
మన సాంకేతిక పరిజ్ఞానం గొప్పగా అందుబాటులోకి వచ్చినా కూడా మానవ మేధస్సుకు అర్థం కాని చాలా విషయాలు ఈ భూమిపై ఉన్నాయన్న విషయం మనకు తెలిసిందే. అందులో చావు మరియు పుట్టుకలు కూడా ఉన్నాయి. ప్రాణం ఎప్పుడు పోతుంది అనే విషయం గురించి ఎవరూ కచ్చితంగా చెప్పలేరు. కానీ ఈ దేవాలయంలో చనిపోయినవారు కొద్దిసేపు తిరిగి ప్రాణాలతో బతుకుతారు. అయితే ఆ దేవాలయం గురించి మనం ఇక్కడ తెలుసుకుందాం.
చనిపోయిన వ్యక్తి కూడా తిరిగి బ్రతికించే శివుని ఆలయం (Lord Shiva’s Temple Where Even a Dead Person Becomes Alive)
1. భారత హిందూ శాస్త్రంలో అత్యంత శక్తివంతమైన దేవాలయాల్లో లఖ్ మండల్ దేవాలయం కూడా ఒకటి. ఈ దేవాలయంలో ప్రధానమైన దైవం ఆ పరమశివుడు. లఖ్ మండల్ దేవాలయం ఒక పురాతన కాలం నాటిది.
2. ఇక్కడ పరమశివుడు నిత్యం నివసించే ప్రాంతంగా అక్కడి ప్రజలు నమ్ముతారు. ఏ దేవాలయంలో పరమశివుడు దర్శనం చేసుకోవడం వల్ల దురదృష్టం పోయి అదృష్టం వరిస్తుందని చెబుతారు.
3. పాండవులు సందర్శించిన పవిత్ర స్థలాల్లో లఖ్ మండల్ మందిరం కూడా ఒకటి. పాండవులు అజ్జాతవాసం చేసిన సమయంలో వారు ఈ లఖ్ మండల్ మందిరంలో కొంత కాలం గడిపారని చెబుతారు.
4. ఇక్కడ పురావస్తు శాఖ వారు జరిపిన తవ్వకాల్లో అనేకమైన కళాఖండాలు బయటపడ్డాయి. వాటిలో అతి ముఖ్యమైనది ఆకర్షణీయమైన స్వామి వారి లింగం.
5. అంత గొప్ప దేవాలయం చుట్టుపక్కల ఉన్న పచ్చదనం అంతా ఆ లింగం పై పడడం చూస్తే ఆధ్యాత్మిక పొంగిపొర్లుతుంది.
6. ఇక ఈ దేవాలయం ముఖ ద్వారం వద్ద మానవ మరియు దానవ అనే రెండు ఎత్తైన విగ్రహాలు ఆకట్టుకొంటాయి. అయితే అక్కడి స్థానికులు మాత్రం ఈ రెండు విగ్రహాల్లో ఒకటి భీమసేనుడిదని మరోకటి అర్జునుడిదని నమ్ముతారు.
7. ఎవరైనా చివరి క్షణాల్లో ఉన్నప్పుడు లేదా మరణించిన వెంటనే ఈ రెండు విగ్రహాల ముందుకు తీసుకొస్తారు.
8. ఆ ప్రదేశంలో పరమశివుడు కొలువై ఉన్నట్లు భావించి ఇక్కడి శివలింగాన్ని అభిషేకం చేసి ఆ నీటిని చివరి ఘడియల్లో ఉన్న వారికి లేదా మరణించిన వ్యక్తి నోట్లో పోస్తే వారు తిరిగి కొద్ది సేపు బ్రతుకుతారని ఇక్కడి ప్రజలు చాల బలంగా నమ్ముతారు. అందుకు ఎన్నో ప్రత్యక్ష ఉదాహరణలు చూపిస్తారు అక్కడి ప్రజలు.
9. అదేవిధంగా ఆ ప్రాంతానికి దగ్గర్లో దుంధి ఓడారి అనే ఒక గుహ ఉంది. స్థానికుల చెబుతున్న కథనం ప్రకారం పాండవులు తమను రక్షించుకోవడానికి ఈ గుహలోనే ఉన్నారని చెబుతున్నారు.
10. ఈ దేవాలయంలో మెరిసే శివలింగంపై నీరు పోస్తే అద్దంలా అద్భుతంగా మెరుస్తూ పోసిన వారి ప్రతి బింబం ఆ లింగంపై స్పష్టంగా కనిపిస్తుంది. అభిషేకం చేసిన నీరు కూడా స్వఛ్చంగా మారుతాయి మరియు రుచి కూడా తియ్యగా మారడం ఈ లింగంలో అద్భుతం.
11. లఖ్ మండల్ అను పదం రెండు పదాల నుంచి పుత్తుంది. లఖ్ అంటే అనేక అని మరియు మండల్ అంటే దేవాలయం లేదా లింగం అని అర్థం.
12. ఈ దేవాలయాన్ని ఉత్తర భారత దేశ శైలిలో నిర్మించడం జరిగింది. లఖ్ మండల్ దేవాలయం చక్రతా నుండి దాదాపు 100 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది.
Spiritual Posts
అరుణాచలం కార్తీక మహాదీపం మహోత్సవం తేదీ & సమయం | Tiruvannamalai Karthigai Deepam 2023 Date
పుజలో ఉండే దీపం అకస్మాత్తుగా ఆరిపోతే శుభమా? అశుభమా? నివారణలు ఏమిటి?! | Is It Bad if Diya Goes Off?
Runa Hartru Ganesha Stotram in Telugu | శ్రీ ఋణహర్తృ గణేశ స్తోత్రం
ప్రతి హిందువు తమ జీవిత కాలంలో నిత్యం పఠించవలసిన నామాలు?! | Compulsory Chanting Stotras by Everyone
దుర్గా దేవి నవరాత్రులలో పాటించవలిసిన నియమాలు ఏమిటి? | Dasara Navaratri Puja Rules