
Afer 17 Years Maha Kumbhabhishekam in Srisailam Temple
1శ్రీశైలంలో 17 ఏళ్ల తర్వాత మహా కుంభాభిషేకం
ద్వాదశ జ్యోతిర్లింగాల్లో ఒకటి, అష్టాదశ శక్తిపీఠాల్లో 6వ శక్తిపీఠం శ్రీశైలం మహా పుణ్య క్షేత్రం. శ్రీశైల భ్రమరాంబ, మల్లికార్జునస్వామి ఆలయంలో మహా కుంభాభిషేకానికి ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఈ ఉత్సవం 17 సంవత్సరాల తర్వాత చేస్తున్నారు కాబట్టి అధికారులు చాల ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు.
ఈ నెల 25వ తేదీ నుంచి 31వ తేది వరకు శ్రీశైలం మహాపుణ్యక్షేత్రంలో మహా కుంభాభిషేకం మహోత్సవాలు నిర్వహించనున్నారు. ఈ మహా కుంభాభిషేకం నిర్వహించడానికి గల ముఖ్య కారణం ఆలయంలోని శివాజీ గోపురంపై కలశాల పునఃప్రతిష్ఠ కార్యక్రమం నిర్వహించడం. ఈ ఉత్సవం స్మార్త, శైవాగమం శాస్త్రాల ప్రకారం మహా కుంభాభిషేకాన్ని అంగరంగ వైభవంగా చేయనున్నారు. ఈ మహా కుంభాభిషేకానికి ఎవరేవరు హాజరు అవుతున్నారో తెలుసుకోవడం కోసం తరువాతి పేజీలో చూడండి.