
నేటి కాలము లో ఉన్న ఆహారపు అలవాట్లు, శ్రమ వల్ల ఒత్తిడి పెరుగుతుంది. తద్వారా నాడీవ్యవస్థ దెబ్బతింటుంది.
యోగా లో ఉన్న వజ్రాసనం, శుప్తవవూజాసనం, పరిపూర్ణ వజ్రాసనం వేస్తే ఒత్తిడుల నుంచి దూరం కావచ్చు అనేది యోగా నిపుణుల మాట
4. పరిపూర్ణసుప్త వజ్రాసనం :
వజ్రాసనంలో కూర్చోవాలి. నెమ్మదిగా పాదాలు రెండూ రెండు ఎడంగా జరిపి, నడుం భాగాన్ని పాదాల మధ్యన నేలకు ఆనేటట్లుగా ఉంచాలి. ఇప్పుడు నెమ్మదిగా రెండు మోచేతులూ పక్కగా ఆన్చి శరీరాన్ని నెమ్మదిగా వెనుకగా భూమి మీదకు ఆన్చాలి. మొత్తం శరీరం నేలకు ఆనేటట్లుగా ఉంచాలి. రెండు చేతులనూ ఒకదానితో ఒకటి పెనవేసి తల మీదగా నిటారుగా భూమిమీద ఉంచాలి. ఇదే స్థితిలో ఊపిరి మామూలుగా పీలుస్తూ ఉండగలిగినంత సమయం ఉండి మెల్లగా యథాస్థితికి రావాలి.
Promoted Content
