
If You Do Not Have Rs 300 Special Darshan Tickets Then How to Get Darshan With Free Tickets
1మీకు రూ.300 ప్రత్యేక దర్శనం టిక్కెట్లు లేకపోతే, ఉచిత టిక్కెట్లతో దర్శనం ఎలా పొందాలి?!
కలియుగ వైకుంఠం అయిన తిరుమలలో ఇప్పుడు భక్తుల రద్దీ సాధరణంగా ఉంది. వైకుంఠం క్యూ కాంప్లెక్స్ కంపార్టుమెంట్ల గదులలో వేచివుండాల్సిన అవసరం లేకుండా భక్తులు నేరుగా శ్రీవారి దర్శన చేసుకోవచ్చు. నిన్న అనగా సోమవారం 65,904 మంది భక్తులు శ్రీవారిని దర్శించుకున్నారు. ఇందులో 29,290 మంది తలనీలాలను ఇచ్చారు. హుండీ ద్వారా వచ్చిన ఆధాయం 3.57 కోట్లు.
మే, జూన్ నెలల శ్రీవారి ప్రత్యేక దర్శనం 300 రూపాయల టికేట్లను, ఆర్జిత సేవ టికేట్లను, వసతి గదుల కోటాను పోయిన నెలలోనే ఇచ్చేశారు. జూలై నెలకు సంబంధించిన అన్ని రకాల సేవ మరియు దర్శనం టికేట్లను ఈ నెల అంటే మే 20న విడుదల చేయడానికి టీటీడీ సన్నహాలు చేస్తుంది.