
పేదవాడి గురుదక్షిణ (ఈ రోజు కధ) | Story of Gurudakshina in Telugu
ప్రాచీన కాలం లో మన దేశం లో గురుకుల వ్యవస్థ ఉండేది. పంజరపు చిలుకల్లాగా బట్టీ పాఠాలు నేర్చునే ఇప్పటి అనారోగ్యకరమైన విద్యావిధానాలు ఏర్పడకముందు జ్ఞానం స్వేచ్ఛనుండీ లభించేది.
సేవ,ప్రేమ,కృతజ్ఞత,పెద్దలపట్ల గౌరవం, మంచి నడవడిక, స్వంతంగా ఆలోచించగలిగే పరిపక్వత అన్నీ గురుకులం లో విద్యార్థులు సహజంగా నేర్చుకునేవారు.
వేలకు వేలు డబ్బులు గుంజే ఇప్పటి విద్యా సంస్థల్లా కాకుండా ఒకప్పుడు చదువు ఉచితంగా చెప్పేవారు. విద్యాభ్యాసం ముగిశాక విద్యార్థులు తమ శక్తి కొద్దీ గురుదక్షిణ సమర్పించుకునే వారు.
ఆ కాలం లో సత్ప్రవర్తనకు, మాట నిలబెట్టుకోవడానికి ఉన్న ప్రాధాన్యత తెలిపేదే ఈ కథ.
3. కౌత్సుకుని ప్రయత్నం
కౌత్సుకుడు నేరుగా ఆ దేశరాజైన రఘుమహారాజు వద్దకు వెళ్ళాడు. అంతకు ముందే రఘు మహారాజు విశ్వజిత్ అనే మహా యజ్ఞాన్ని చేసి తన ధనాన్ని మొత్తం దానం చేశాడు.
మట్టిపాత్రలో పుష్పాలను నింపుకుని భగవంతునికి పూజ చేస్తున్నాడు. అప్పుడే వచ్చిన కౌత్సుకుని చూసి అతని బ్రహ్మ తేజస్సుకు నమస్కరించి ఉన్నతాసనాన్ని ఇచ్చి గౌరవించాడు.
రఘుమహారాజంతటి వాడు చేతులు కట్టుకుని నిలబడి కౌత్సుకుని స్వామీ మీకు నేను ఏమి చేయగలను.? అని అడిగాడు. రఘుమహారాజు దానగుణానికి, సౌశీల్యానికి కౌత్సుకుడు ఆశ్చర్యపోయాడు. రాజువద్ద ధనం లేదని తెలిసి ‘ మీకు వీలుపడదు.
నీను వెళ్లివస్తా’నని లేవబోయాడు. రఘుమహారాజు అతనిని ఆపి మీ కోరిక యేదైనా తప్పక తీరుస్తాను దయచేసి చెప్పండి అని అడిగాడు. కౌత్సుకుడు విషయం వివరించాడు. అప్పుడు రఘు మహారాజు ఒక్క రోజు గడువు అడిగాడు.
Comment: valaki entha avasaramo an the tesukunnaru, they are good.