
పేదవాడి గురుదక్షిణ (ఈ రోజు కధ) | Story of Gurudakshina in Telugu
ప్రాచీన కాలం లో మన దేశం లో గురుకుల వ్యవస్థ ఉండేది. పంజరపు చిలుకల్లాగా బట్టీ పాఠాలు నేర్చునే ఇప్పటి అనారోగ్యకరమైన విద్యావిధానాలు ఏర్పడకముందు జ్ఞానం స్వేచ్ఛనుండీ లభించేది.
సేవ,ప్రేమ,కృతజ్ఞత,పెద్దలపట్ల గౌరవం, మంచి నడవడిక, స్వంతంగా ఆలోచించగలిగే పరిపక్వత అన్నీ గురుకులం లో విద్యార్థులు సహజంగా నేర్చుకునేవారు.
వేలకు వేలు డబ్బులు గుంజే ఇప్పటి విద్యా సంస్థల్లా కాకుండా ఒకప్పుడు చదువు ఉచితంగా చెప్పేవారు. విద్యాభ్యాసం ముగిశాక విద్యార్థులు తమ శక్తి కొద్దీ గురుదక్షిణ సమర్పించుకునే వారు.
ఆ కాలం లో సత్ప్రవర్తనకు, మాట నిలబెట్టుకోవడానికి ఉన్న ప్రాధాన్యత తెలిపేదే ఈ కథ.
2. వరతంతుడు అడిగిన గురుదక్షిణ
నాయనా నువ్వు పేదవాడివి నిన్ను నీనుంచీ నేను ఏమీ ఆశించను. నువ్వు క్షేమంగా జీవనాన్ని సాగించు. అన్నాడు. కౌత్సుకుడు గురుదక్షిణ అడగవలసిందే అని గురువును బలవంతపెట్టాడు.
అప్పుడు కౌత్సుకుని పరీక్షించడానికి వరతంతుడు ఒక గురుదక్షిణ అడిగాడు. ‘నీకు నేను 14 విద్యలు నేర్పించాను.
కనుక ఒక ఏనుగుపై కూర్చుని ఒకడు రివ్వున రాయి విసిరితే అది ఎంత దూరం వెళుతుందో అంతటి ధన రాశులను 14 ఇవ్వమన్నాడు. కౌత్సుకుడు గురువుగారి కోరికకు బెదరలేదు. ధనాన్ని సాధించుకు రావడానికి బయలుదేరాడు.
Comment: valaki entha avasaramo an the tesukunnaru, they are good.