ఆ అమ్మవారు శ్రీ రాముని రాకకై ఇప్పటికీ ఎదురుచూస్తూనే ఉంది

0
11196

 

rama1
Rama and goddess vaishno devi

Rama and Goddess Vaishno Devi 

1. శ్రీ రాముని రాకకై ఇప్పటికీ ఎదురు చూస్తున్న దేవి ఎవరు?

కొన్ని లక్షల సంవత్సరాల క్రితం మాహాకాళి మహాలక్ష్మి మహా సరస్వతుల అంశతో త్రిశక్తి స్వరూపిణిగా వైష్ణవి అనే బాలిక జన్మించింది. ఆమె జ్ఞాన తృష్ణను ఈ భూమండలంపై ఏ గురువూ తీర్చలేక పోయాడు. మహా శక్తి రూపమైన వైష్ణవి ధ్యానం లో మునిగి అనేక విషయాలను స్వయంగా నేర్చుకుంది. శ్రీరామ చంద్రుడు అరణ్యవాసం లో ఈమెను కలుసుకుంటాడు. అప్పుడామే రాముడే విష్ణుమూర్తి రూపమని గ్రహించి తనను ఆయనలో లీనం చేసుకొమ్మని ప్రార్థిస్తుంది. అప్పుడు శ్రీరాముడు తాను అరణ్య వాసం నుంచీ ఒచ్చిన తర్వాత తిరిగి కలుసుకుంటాననీ అప్పుడు ఆమె రాముని గుర్తు పడితే ఆమె కోరికను నెరవేరుస్తానని ప్రమాణం చేసి వెళ్తాడు. రామచంద్రుడు అరణ్యవాసం ముగించుకుని ఒక వృద్ధుని వేషం లో వైష్ణవికి కనిపిస్తాడు. అప్పుడామే రాముని గుర్తుపట్టలేక పోతుంది. ఆ కారణం చేత శ్రీ రాముడు ఆమెను కలియుగం లో తాను కల్కి రూపమై చేరుకుంటాననీ అప్పటివరకూ భక్తుల కోరికలు నెరవేరుస్తూ త్రికూట పర్వత సానువు లలో తపస్సునాచరించమని ఆదేశిస్తాడు.

వైష్ణవీ దేవి తపస్సు

వైష్ణవీ దేవి ఉనికిని కనుగొన్న గోరఖ్  నాథుడనే తాంత్రికుడు గ్రహించి ఆమెను గురించి తెలుసుకొమ్మని తన శిష్యుడైన భైరవుని పంపించాడు. వైష్ణవి సౌందర్యానికి మోహితుడైన భైరవుడు ఆమె వెంట పడతాడు. భైరవుని చేష్టలకు విసిగిపోయిన వైష్ణవి వాయురూపం లో పర్వాతాలలోకి వెళ్లిపోతుంది. అయినా భైరవుడు ఆమెను వెంబడించేసరికి కాళికాంశ గా భైరవుని శిరసును ఖండిస్తుంది. పశ్చాత్తాపం చెందిన భైరవుడు కాపాడమని అమ్మను ప్రార్థిస్తాడు. భైరవుని ప్రార్థనకు కరిగిన వైష్ణవీ దేవి తనను దర్శించిన భక్తులంతా భైరవుని దర్శించనిదే యాత్రా ఫలం పూర్తికాదని అమ్మవారు వరమిస్తుంది. అప్పటినుండీ అమ్మను దర్శించిన పిదప భక్తులంతా భైరవుని దర్శనం చేసుకుంటున్నారు.

ఆలయ వివరాలు

ఈ ఆలయం ఉత్తర భారత దేశం లోని జమ్ము- కాశ్మీర్  రాష్ట్రంలో జమ్ము కు సుమారు 65 కిలోమీటర్ల దూరంలో వైష్ణోదేవీ ఆలయం ఉంటుంది. ఎత్తైన హిమాలయ పర్వత ప్రాంతంలోని త్రికూట పర్వత శ్రేణి లో ఈ ఆలయం ఉంటుంది. జమ్ము నుండి 50 కిలో మీటర్ల దూరం లో వున్న కాట్రా ప్రాంతానికి హెలి కాప్టర్ల లోనూ ఇతర వాహనాల్లోనూ వెళ్లవచ్చు. అక్కడి నుండి కాలి నడకన, గుర్రాలమీద, పల్లకిల్లో వెళ్లవచ్చు. ఇక్కడికి ఆలయం సుమారు 15 కిలో మీటర్ల దూరంలో వున్నది. ఈ దారి చాల కష్టతరమైనది.కొండను ఎక్కేవారు జై మాతాదీ అంటూ అమ్మవారిని తలుచుకుంటూ వెళతారు. ఈ ఆలయం వున్న ప్రాంతాన్ని భవన్ అని అంటారు. మహాకాళి, మహా లక్ష్మి మహా సరస్వతి రూపాలలో అమ్మవారి మూడు శిరసులు ఇక్కడ దర్శించవచ్చు.

Related Stories

Shani Dev Secrets | శనిదేవుడి ఈ ఐదు రహస్యాల గురించి తెలుసుకోండి.

దరిద్రాన్ని పారద్రోలే పూర్ణవల్లీ దేవి | Story of Poornavali

సర్పదోష హారిణి మానసాదేవి..! Goddess saves From Sarpadosham in Telugu

నవవధువు ఆరోగ్యాన్ని కాపాడే అపాలదేవి | Goddess Who Protects brides health

సకల కళ్యాణ కారకం భువన మోహన రూపం | Story of Gopala Sundari in Telugu

 

Promoted Content

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here