
ప్రకృతిని పరమాత్మ స్వరూపంగా, శక్తిగా పూజించడం మనకు అనాదిగా వస్తున్న ఆచారం.
మనం దేని మీదైతే ఆధారపడి జీవిస్తున్నామో, మన మనుగడ దేనివలనైతే జరుగుతున్నదో అటువంటి శక్తిని గౌరవించడం కృతజ్ఞతాపూర్వకంగా ఆరాధించడం మన కర్తవ్యం.
ఈ విషయాన్ని శ్రీకృష్ణ పరమాత్ముడే ఆచరించి చూపించాడు. ఆ కథను తెలుసుకుందాం.
3. శ్రీ కృష్ణుడు చెప్పిన గోవర్ధన గిరి పూజ
‘ గోవర్ధన గిరి పాద భాగాన్ని శుభ్రపరిచి గోమయముతో అలికి, ముగ్గులు వేయాలి. పూజా ద్రవ్యాలను శ్రద్ధగా సమకూర్చుకోవాలి.
స్నానాదికాలను చేసుకుని గోవర్ధనుని శాస్త్రోక్తంగా షోడశోపచార సహితంగా భక్తి శ్రద్ధలతో పూజించాలి. గోవర్ధన గిరి పూజలో భాగంగా అన్నసంతర్పణ చేయండి.
వీటితో పాటుగా శ్రీకృష్ణుడు ప్రతివారూ ఆచరించవలసిన కొన్ని ధర్మాలను వివరించాడు.
‘పూజకు వచ్చేముందు మీ కర్తవ్యాలన్నీ నిర్వహించుకుని రండి. ఇంట్లో దేవతలను, మాతాపితరులను పూజించండి. వృద్ధులను, పిల్లలనూ ఆకలితో వదలి రాకండి.
వారికి కావలసినంత ఆహారాన్ని సమకూర్చి రండి. ఇంటివద్ద ఉన్న గోవులకి, పెంపుడు జంతువులకి, పక్షులకి ఆహారాన్ని ఇచ్చి రండి.’ అని చెప్పాడు.