
1. స్త్రీలు వేదాలు చదవకూడదా?
స్త్రీలు వేదాలను చదవకూడదన్న వాదన మనం ఇప్పటికీ వింటూనే ఉన్నాం. వేదాలకు అధిదేవత గాయత్రీ మాత స్త్రీ రూపమే. వాక్కును ప్రసాదించే సరస్వతీదేవీ స్త్రీ రూపమే.
మరి ఆడవాళ్ళు వేదాలను ఎందుకు చదవకూడదు అన్నారు? వేదం చదివినప్పుడు ఆ ధ్వనులు నాభిస్థానం నుంచీ ఉత్పన్నమౌతాయి.
దాని ద్వారా వేడి ఉత్పన్నమౌతుంది. ఫలితంగా గర్భసంచి కి ప్రమాదం జరగ వచ్చు అని కొందరు పండితుల అభిప్రాయం.
కానీ వేద కాలం లో తమ పాండిత్యం తో ఋషులను కూడా ఓడించిన స్త్రీలు ఉన్నారు. వేదాలలోని కొంత భాగాలను రచించారు.
పరబ్రహ్మ తత్వాన్ని తెలుసుకుని పండిత చర్చలలో బ్రహ్మ వాదినులుగా ప్రఖ్యాతిని పొందారు.
Promoted Content