ఒక వస్తువు ఉచితంగా అమ్ముతున్నారు అంటే దానివెనక ఎటువంటి కారణాలు ఉంటాయో ఆలోచించకుండా, ఆ ఉచితంగా లభించే వస్తువు కోసం మరో అనవసరమైన వస్తువు కొంటూ ఉంటారు చాలామంది. ఈ కాలం లో ఈ ఉచితం అనేది మరీ వేలం వెర్రిగా పెరిగిపోయింది. అలా ఉచితంగా లభించే వస్తువుల మర్మాన్ని చెప్పే కథ తెలుసుకుందాం.
2. రత్నమ్మ చేసిన ఆలోచన
తన నువ్వులను సంతకు తీసుకుని వెళ్లింది. అక్కడ ఎవరైనా ముడి నువ్వులు ఇస్తే తాను వాటికి బదులుగా అదే తూకంతో ఉన్న శుభ్రం చేసిన నువ్వులను ఇస్తానని చెప్పింది. అది విన్న అంజమ్మ తనదగ్గర ఉన్న ముడి నువ్వులను ఇచ్చి రత్నమ్మ దగ్గర ఉన్న శుభ్రం చేసిన నువ్వులను తీసుకోవాలని అనుకుంది. అప్పుడు అంజమ్మ కొడుకు రాఘవ ఆమెతోనే ఉన్నాడు. అతను నీతిశాస్త్రం చదువుకున్నవాడు. రత్నమ్మ ఆలోచనలో ఏదో తిరకాసు ఉందని గ్రహించాడు. వెంటనే తల్లిని ఆ నువ్వులు కొనవద్దని, ఎవరూ ఏదీ ఉచితంగా ఇవ్వరనీ చెప్పాడు. అతను చెబుతుండగా అటుగా ఒక కుక్క వచ్చింది. దాని మూతికి నువ్వులు అంటుకుని ఉన్నాయి. రత్నమ్మ ఆ కుక్కను చూసి ‘మళ్ళీ వచ్చావా..! నీవల్లే నేను ఇంత ఎండనబడి ఈ ఎంగిలి నువ్వులను అమ్మడానికి అవస్థ పడుతున్నాను. ఫో ఇక్కణ్ణుంచీ అని మెల్లిగా ఆ కుక్కను కసిరింది. రత్నమ్మ మాటలు విన్న అంజమ్మకు ఉచితం ఆశ చూపించి జరిగే మోసాలు ఎలా ఉంటాయో అర్థమయింది.
వాస్తవంగా 10రూపాయల వస్తువు 5రుపాయలకు ఇస్తరా