గుడ్డు మరియు మాంసాహార పదార్ధాలను తిని గుడికి వెల్లవచ్చా?

0
12192

egg

Back

1. గుడ్డు మరియు మాంసాహార పదార్ధాలను తిని గుడికి వెల్లవచ్చా?

గుడ్డు మరియు మాంసాహార పదార్ధాలు రజో గుణ, తమోగుణ  సంబంధమైన పదార్ధాలు. కోపము, ఆవేశము మరియు కామ వికార కోరికలు రజస్తమో గుణాలకు ప్రతీకలు . వాటిని స్వీకరించడం ద్వారా సత్వ గుణ ప్రభావము తగ్గి రజస్తమో గుణాల ప్రభావము పెరుగుతుంది. సాత్వికమైన ఆలోచనలు,క్రియా కలాపములను సత్వ గుణం అంటారు. దేవాలయాలను దర్శించినప్పుడు , దైవారాధన చేసే సమయంలో ప్రధానంగా సత్వ గుణం కలిగి ఉండాలి. రజోగుణ తమోగుణాల ప్రభావమువల్ల మనో నిగ్రహం కోల్పోయే అవకాశం ఉంది. దానివల్ల మన దైవారాధన సఫలము అవ్వదు. సత్వగుణం స్థిరంగా ఉండాలంటే ఆహారము కూడా సాత్వికంగా ఉండవలెను. సాత్విక ఆహారము అనగా పాలు, పండ్లు,ఆకు కూరలు, కూరగాయలు మొదలగునవి. కనుక గుడ్డు మరియు మాంసము దైవారాధన సమయములో నిషిద్ధం.

Promoted Content
Back

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here