
1. పిసినారి
పూర్వం పండరి పురానికి సమీపం లో శ్రీనివాసనాయకుడనే ధనవంతుడు ఉండేవాడు. అతను చాలా పిసినారి. అతని భార్య సరస్వతీబాయి ఎంతో సద్గుణవంతురాలు ఉత్తమురాలు. పాండురంగ విఠలుని పరమ భక్తురాలు.
ఆమె తన భర్త క్షేమం కోసం ఎప్పుడూ నోములనూ వ్రతాలనూ చేసేది. దాన ధర్మాలను చేసేది. పిసినారి అయిన శ్రీనివాసుడు ఆమె దాన ధర్మాలనూ పూజలనూ చూసి ధనం వృధా చేస్తోందని తిట్టేవాడు. ఆమె అతని తిట్లకోర్చి పుణ్య కార్యాలను చేసేది.
Promoted Content