
Suvarchala Anjaneya Swamy Temple
శ్రీ సువర్చలా సహిత ఆంజనేయస్వామి ఆలయం ఎక్కడ ఉంది?
కృష్ణాజిల్లాలోని ఉయ్యూరు మండలంలోని ఉయ్యూరు గ్రామంలో శ్రీ సువర్చలా సహిత ఆంజనేయ స్వామి ఆలయం ఉంది. ఇటువంటి ఆలయాలు చాలా అరుదు.
ఈ ఆలయం ఎప్పుడు ఎవరు నిర్మించారు?
ఈ ఆలయాన్ని గుండు లక్ష్మీ నరసింహావధానులుగారు సుమారు 200 సంవత్సరాల క్రితం తన స్వంతధనంతో నిర్మించి, ఆలయంలో ఉత్సవ ముర్తులను ధ్వజస్తంభాన్ని ప్రతిష్టించి, ధూప దీప నైవేద్యాలను కొనసాగించినట్లు తెలుస్తోంది. ఆ తర్వాత 23`6`1988వ సంవత్సరంలో శ్రీ గబ్బిట దుర్గాప్రసాద్గారి ఆధ్వర్యంలో వైఖానస ఆగమవిధానాలతో స్వామి వారిని పున: ప్రతిష్టించారు. 13`06`1993న ధ్వజస్తంభాన్ని ప్రతిష్టించారు.
ఆలయ ప్రత్యేక పూజలు:
స్వామివారికి నిత్యం ధూప దీప నైవేద్యాలు, మంగళ, శని వారాలలో విశేష పూజలూ జరుగుతాయి. హనుమాన్ చాలీసా, విష్ణు సహస్రనామం, లలితా సహస్ర నామ పారాయణాలు ఇక్కడ నిత్యం జరుగుతూ ఉంటాయి. చైత్ర పౌర్ణిమ రొజున మరియు ఆంజనేయస్వామి జన్మదినమయిన వైశాఖ బహుళ దశమి నాడు ఆలయం భక్తజనం తో పోటెత్తుతుంది. భోగినాడు శాంతి కళ్యాణం, ఊరేగింపు ఉత్సవం జరుగుతాయి.ఆ రోజున శ్రీ సువర్చలా ఆంజనేయుల కళ్యాణం అత్యంత వైభవంగా జరుగుతుంది.