
Nainital Lake
మానస సరోవరానికి సమానమైన పవిత్రత
ఉత్తరాఖండ్లోని నైనితాల్, సరస్సుల జిల్లాగా పేరుగాంచింది. ఇది ఒక ప్రసిద్ధ హిల్ స్టేషన్ మాత్రమే కాదు, పురాణ ప్రాధాన్యత కలిగిన ఆధ్యాత్మిక క్షేత్రం కూడా. నైనితాల్ పేరు నైనీ (కన్ను) మరియు తాల్ (సరస్సు) కలయికగా వచ్చింది. నైనీతాల్ అంటే కన్ను ఆకారంలో ఉన్న సరస్సు అని అర్థం. ఇది సముద్ర మట్టానికి 2084 మీటర్లు (6837 అడుగులు) ఎత్తులో ఉంది
పురాణ ప్రాధాన్యత
ఈ సరస్సు ప్రస్తావన స్కందపురాణంలో కూడా కనిపిస్తుంది. గతంలో దీనిని ముగ్గురు ఋషుల సరస్సు అని పిలిచేవారు. పురాణ కథనం ప్రకారం
- అత్రి, పులస్త్య, పులాహ ఋషులు ఒకసారి ఈ ప్రాంతానికి వచ్చారు.
- వారు దప్పికతో బాధపడుతుండగా, గొయ్యి తవ్వి మానస సరోవరం నీరు తీసుకువచ్చారు.
- ఈ నీరు కారణంగా ఈ సరస్సు ఏర్పడింది.
- ఈ సరస్సులో స్నానం చేస్తే, మానస సరోవరంలో స్నానం చేసినంత పుణ్యం లభిస్తుందని చెబుతారు.
నైనీదేవి ఆలయం
నైనితాల్ సరస్సు ఉత్తర దిశలో నైనీదేవి ఆలయం ఉంది. ఇది భారతదేశంలోని 51 శక్తిపీఠాల్లో ఒకటి.
- పురాణాల ప్రకారం, దాక్షాయణి (సతీ) ఎడమ కన్ను ఈ ప్రాంతంలో పడింది.
- అందువల్లనే ఈ సరస్సు ప్రక్కన నైనీదేవి ఆలయం నిర్మించబడింది.
- ఇది పవిత్ర శక్తిపీఠంగా భావించబడుతుంది.
నైనీదేవి ఆలయం కథనం
- ఈ ఆలయానికి సంబంధించి మరో ఆసక్తికర పురాణ కథనం ఉంది.
- నైనా అనే గోవుల కాపరి బాలుడు, పశువులను మేతకు తీసుకువెళ్తాడు.
- ఒక తెల్ల ఆవు రాతి పైకి పాలు ధారగా కారిస్తుండేది.
- ఆ రాత్రి దుర్గామాత ఆ బాలుడి కలలో ప్రత్యక్షమై, ఆ రాయి తన ఆసనమని చెబుతుంది.
- బాలుడు ఈ విషయాన్ని రాజు నైనాకు తెలిపాడు.
- రాజు అక్కడ నైనీదేవి ఆలయాన్ని నిర్మించి, ఆ బాలుడి పేరును ఆలయానికి పెట్టాడు.
మహిషాసురుని కథ
- ఈ ఆలయాన్ని మహిష పీఠంగా కూడా పిలుస్తారు.
- పురాణాల ప్రకారం, మహిషాసురుడు, శివుని వరం పొందిన రాక్షసుడు, ప్రజలను బాధపెట్టడం ప్రారంభించాడు.
- దేవతలందరూ కలిసి దుర్గాదేవిని సృష్టించారు.
- యుద్ధంలో దుర్గాదేవి మహిషాసురుడిని హతమార్చి, అతని కళ్లు పీకేసింది.
- ఈ ఘటన తర్వాత, “జై నైనా” అనే నినాదం ద్వారా ఈ దేవతను నైనీదేవి అని పిలవడం మొదలైంది.
పర్యాటక ఆకర్షణలు
నైనితాల్ చుట్టుపక్కల ప్రకృతి సౌందర్యంతో పాటు అనేక ఆధ్యాత్మిక, సాంస్కృతిక ప్రదేశాలు ఉన్నాయి
- కిల్ బరీ: నైనితాల్ నుండి 10 కిలోమీటర్ల దూరంలో ఉంది.పచ్చటి ఓక్, ఫైన్, రోడోడెండ్రాన్ చెట్లు ఉన్నాయి.580 రకాల పక్షులు ఇక్కడ కనిపిస్తాయి.
- హనుమాన్ ఘరీ, ఘెరకల్, అరబిందో ఆశ్రమం వంటి ఆధ్యాత్మిక ప్రదేశాలు.
- స్నో వ్యూ, టిఫిన్ టాప్, బారా బజార్, మరియు ఇతర పర్యాటక ప్రాంతాలు.
నైనితాల్ చేరుకోవడం ఎలా?
- విమాన ద్వారా:
దగ్గర్లోని పంత్నగర్ ఎయిర్పోర్ట్ (70 కిమీ). పంత్నగర్ నుండి టాక్సీలు అందుబాటులో ఉన్నాయి. - రైలు ద్వారా:
సమీప రైల్వే స్టేషన్ కాథ్గోదాం (34 కిమీ). అక్కడి నుండి బస్సులు లేదా టాక్సీలు అందుబాటులో ఉన్నాయి. - రోడ్డు ద్వారా:
నైనితాల్కు ఢిల్లీ (320 కిమీ) నుండి బస్సులు అందుబాటులో ఉన్నాయి. ప్రైవేట్ కార్లు లేదా క్యాబ్లు కూడా తీసుకెళ్లవచ్చు. - ఉత్తమ సమయం:
మార్చి-జూన్ లేదా అక్టోబర్-డిసెంబర్.
Related Posts
kalasha temple | కాశీ క్షేత్రంతో సమానమైన ఈ పుణ్యక్షేత్రాన్ని మీరు సందర్శించారా?
Swetharkamoola Ganapathi Temple | స్వయంభూవుగా ఉద్భవించిన శ్వేతార్క మూలగణపతి
Sri Seshasayana Ramanjaneya Swami Devasthanam | శ్రీరాముడు శయనిస్తూ దర్శనమిచ్చే ఆలయం ఇదే.