తిరుమలలో శ్రీవారికి పగిలిన కుండలో మాత్రమే ఓడు ప్రసాదం సమర్పిస్తారు, ఎందుకు? | Secretes About Prasadams of Tirumala

0
1641
Odu Prasadam to Tirumala Sri Venkateswara Swamy in Broken Pot
What is Odu Prasadam and Why Offering Prasadam to Tirumala Sri Venkateswara Swamy in Broken Pot?

How Odu Prasadam Will Offer to Lord Sri Venkateshwara Swamy in Tirumala?

1తిరుమలలో శ్రీ వెంకటేశ్వర స్వామికి ప్రసాదం ఎలా నివేదిస్తారు?

తిరుమల ఏడుకొండలస్వామి రోజు రకరకాల పిండి వంటలు, అన్నప్రసాదం, నైవేద్యంగా సమర్పిస్తారు. ఒక్కో వారానికి ఒక్కో ప్రసాదం సమర్పిస్తారు. ఒక్కొక్క నైవేద్యాన్ని ఒక్కో ఆరాధనలో సమర్పించడం అనవాయితీగా వస్తుంది. శ్రీవారికి ఎన్ని గంగళాలు ప్రసాదం ఉన్న కూడా ఆ ఒక్క ప్రసాదం మాత్రం కులశేఖర పడి దాటి శ్రీవారికి నివేదిస్తారు. అయితే ఆ ప్రసాదం ఏంటి?. దాని యొక్క ప్రత్యేకత ఏమిటి?. ఆ ప్రసాదాన్ని ఓడు ప్రసాదం అని ఎందుకు పిలుస్తారు?. అసలు ఓడు అంటే ఏమిటి అనే విషయాల గురించి మనం తెలుసుకుందాం.

వెంకటేశ్వర స్వామికి సమర్పించే ఓడు ప్రసాదం (Odu Prasad offered to Lord Venkateswara)

1. ఓడు అనగా పగిలిన మట్టి కుండ.
2. తొండమాన్ అనే చక్రవర్తి వేంకటేశ్వరస్వామికి ప్రియమైన భక్తుడు.
3. శ్రీవారి మీద ఎనలేని భక్తి చూపించేవాడు.
4. శ్రీవారికి రోజు బంగారు పుష్పాలతో అర్చన చేసే వాడు.
5. స్వామి వారికి తనంత భక్తుడు లేడంటూ గర్వంగా ఉండేవాడు.
6. ఒక రోజు స్వామి వారి పాదాల వద్ద మట్టి పుష్పలు కనిపిస్తాయి.
7. తొండమాన్ చక్రవర్తి ఆ మట్టి పుష్పాలు స్వామి వారి వద్దకు ఎలా వచ్చాయని మంత్రిని అడుగుతాడు.
8. అప్పుడు శ్రీవారు హే ఆయనకు ఆ మట్టి పుష్పాలు ఇక్కడికి ఎలా వచ్చాయో వివరిస్తారు.
9. పూర్వం రోజుల్లో స్వామి వారి పై అపారమైన భక్తి కలిగిన కుమ్మరి దాసుడు అనే ఒకతను ఉండేవాడు.
10. రోజు శ్రీవారి కైంకర్యాలు కోసం కుండలను సమర్పించేవాడు.
11. ఆ కుమ్మరి దాసు రోజు అతని ఇంటి వద్దనే మట్టి పూలతో స్వామి వారికి అర్చించేవాడు.
12. ఆయన ఇంటి వద్ద సమర్పించిన పుస్పాలు శ్రీవారి గర్భాలయంలో స్వామి వారి పాదాల వద్దకు వచ్చేవట.
13. కుమ్మరి దాసు నీకన్నా గొప్ప భక్తుడు అని శ్రీవారు తొండమాను చక్రవర్తితో చేప్పరట.
14. ఆ కుమ్మరి దాసు చేసిన ఓడులోనే స్వామి వారి ప్రసాదం స్వీకరిస్తానని చెప్పారట.
15. అప్పుడు ఒక కుండను తీసుకోని పై భాగం వరకు పగులగొట్టి క్రింది భాగంలో ఆకూ వేసి కుండ యొక్క పై భాగాన్ని క్రింద ఉంచి స్వామివారికి ప్రసాదాలు సమర్పించేవారు.
16. కాలక్రమేణా ఆ ఓడు తయారు చేసే వారి సంఖ్య తగ్గి గంగాళాలు అందుబాటులోకి రావడం వలన ఓడు వినియోగం తగ్గిపొయింది.
17. ఈ రోజుకు కూడా స్వామివారికి గర్భాలయంలో సమర్పించే ప్రసాదాన్ని ఓడు ప్రసాదం అనే పిలుస్తారు.

“Hariome” ను ఆదరిస్తున్న మిత్రులకు అభినందనలు. ఈ రోజు వరకు మన హరిఓం ద్వార మీకు మంచి సమచారాన్ని అందించడం జరిగింది. భవిష్యత్‌లో మీకు మరింత చేరువవ్వడం కోసం “Hariome” కొత్త ‘WhatsApp‘ ఛానెల్ ని ప్రారంభించడం జరిగింది. దేవాలయాల సమాచారం, పండుగల సమాచారం, ధర్మ సందేహాలు, ఆధ్యాత్మికం & పూజా విధానాలు వంటి సంచారం కోసం మా ఛానెల్ ని అనుసరించండి.

https://whatsapp.com/channel/0029VaAdPpAB4hdJqbRpuf1j

Related Stories

అయోధ్య రామ మందిరం నియమాలు | Ayodhya Ram Mandir Entry Rules & Regulations

కలియుగ వైకుంఠం తిరుమలలో వైకుంఠ ఏకాదశి ఎలా జరుగుతుంది? | How Vaikuntha Ekadashi Celebrate in Tirumala

ధనుర్మాస వైభవం & విశిష్ఠత | Dhanurmasa Glory & Distinction

వైకుంఠ ఏకాదశి కథ, పరమార్ధం & ఆధ్యాత్మిక స్పూర్తి | Vaikunta Ekadashi Stories & Spiritual Inspiration

Vaikunta Ekadasi 2025 Telugu | వైకుంఠ ఏకాదశి తేదీ, పూజా విధానం & ఉపవాస నియమాలు

Vaikunta Ekadasi Significance | వైకుంఠ ఏకాదశి ప్రాముఖ్యత & పాటించవలసిన ముఖ్య నియమములు ఏమిటి?

Matsya Dwadashi 2025 | మత్స్య ద్వాదశి విశిష్టత, పూజా విధానం & వ్రత కథ

Pradosha Pooja & Vrath 2025 Dates in Telugu | ప్రదోష వ్రతం యొక్క ప్రాముఖ్యత ఏమిటి ? ఎవరిని పూజించాలి ?

Pradosha Kalam In Telugu | ప్రదోష వేళ అంటే ఏమిటి?