
Lord Ganesh Temples in India Which Are Need To Darshan on Vinayaka Chaviti
1వినాయక పండుగ రోజు దర్శించుకోవలసిన గణేషుని ఆలయాలు
గణేష్ నవరాత్రుల సమయంలో ఈ గణపతి దేవాలయాలు దర్శించుకుంటే అదృష్టం మిమ్మల్ని వరించినట్టే.
వినాయక చవితి పండుగ సంబరాలు దేశమంతట ఘనంగా మొదలైయ్యాయి. పల్లె, పట్టణం, నగరం అనే భావన లేకుండా ప్రతి ఒక్కరూ కలిసి కట్టుగా చందాలు అడిగి, మండపాలు వేసి ఆ గణనాథునికి పూజలు చేస్తారు. నియమ నిబంధనలతో ఘనంగా గణపతి నవరాత్రులు చేస్తారు. గణపతి సన్నిధిలో అన్నదాన కార్యక్రమం నిర్వహిస్తారు. 9 రోజులు భక్తితో భజనలు నిర్వహిస్తారు. ఈ నవరాత్రి సమయంలో ఈ దేవాలయలను దర్శిస్తే మనం కోరిన కోర్కెలు నెరవేరుతాయని పండితులు చెబుతున్నారు. ఆ దేవాలయలు ఏంటో మనం ఇక్కడ చూద్దాం.
భారతదేశంలోని ప్రసిద్ధ పురాతన గణేశ దేవాలయాలు (Famous Ancient Lord Ganesha Temples In India)
కాణిపాకం (Kanipakam Temple):
ఈ వినాయక దేవాలయం చిత్తూరు జిల్లాలోని, కాణిపాకం గ్రామంలో ఉన్నది. ఈ దేవాలయాన్ని చోళ రాజు ఈ కులోత్తుంగ చోళుడు నిర్మించాడు. ఇది 1000 సంవత్సరాల పురాతనమైన, చాలా ప్రసిద్ధి చెందిన దేవాలయం. వినాయక విగ్రహం రోజురోజుకూ పరిమాణం పెరుగుతుంది. ఇక్కడ వినాయకుడు బావిలో ఉంటాడు. ఆ పవిత్ర బావిలోని నీరు ఎప్పుడూ ఎండిపోదు. అది ఈ దేవాలయం యొక్క ప్రత్యేకత.
సిద్ధి వినాయక దేవాలయం (Sri Siddhi Vinayaka Temple, Mumbai):
ఇది ముంబై నగరంలో ఉన్నది. వినాయకుడికి అంకితం చేయబడిన ప్రసిద్ధ దేవాలయాలలో ఇది కూడా ఒకటి. ఇక్కడి వినాయకున్ని నవాసాచ గణపతి అని పిలుస్తారు, అంటే కోరికలు తీర్చేవాడు అని అర్థం. ఈ దేవాలయంను 1801లో నిర్మించారు. ఈ దేవాలయం చూడటానికి చాలా అందంగా కనిపిస్తుంది. ఈ దేవాలయం చాలా మంది యాత్రికులను మరియు పర్యాటకులను చాలా ఆకర్షిస్తుంది. యాపిల్ సీఈఓ, టిమ్ కుక్ ఈ దేవాలయాన్ని సందర్శించిన తరువాతనే తన భారత పర్యటనను ప్రారంభించారు.
శ్రీమంట్ దగ్డుషేత్ హలవై గణపతి మందిర్ (Shreemant Dagdusheth Halwai Ganpati Mandir):
ఇది పూణే నగరంలో ఉన్నది. ఈ దేవాలయంలో 7.5 అడుగుల ఎత్తు మరియు 4 అడుగుల వెడల్పు గల గణపతి విగ్రహం ఉంది. లోకమాన్య తిలక్ ఇక్కడ నుండి గొప్ప వినాయక ఉత్సవాన్ని ప్రారంభించాలని నిర్ణయించుకున్నాడు.
విఘ్నహర ఆలయం (Vighnahar Temple):
ఈ దేవాలయం పూణే నుండి 85 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఓఝర్ అనే ప్రాంతంలో కుకాడి నది ఒడ్డున నిర్మించబడింది. ఈ దేవాలయం విఘ్నహర్త, గణేశుడిచే విఘ్నాసురుడిని ఓడించిన స్కంద పురాణం గురించి తెలియచేస్తుంది. ఈ దేవాలయం విస్తృతమైన, అలంకరించబడిన ప్రవేశద్వారం మరియు విశాలమైన ప్రాంగణంతో రూపొందించడం జరిగింది.
గణపతిపూలే టెంపుల్ (Ganpatipule Temple):
ఈ దేవాలయం ముంబై నగరానికి 350 కిలోమీటర్ల దూరంలో కొంకణ్ జిల్లాలో నిర్మించడం జరిగింది. 400 సంవత్సరాల పురాతనమైన, పశ్చిమ ముఖంగా ఉన్న గణపతి దేవాలయం ఇది. ఈ దేవాలయాన్ని ముద్గల్ పురాణంలో పశ్చిమ ద్వారం-దైవం అని కూడా పిలుస్తారు. ఈ ప్రాంత ప్రజలు దేవాలయంలో వినాయక విగ్రహం పశ్చిమ దిశను రక్షించడానికి ప్రత్యక్షమైంది నమ్ముతారు.
పిళ్లైయార్ దేవాలయం (Pillaiyar Temple):
ఇ దేవాలయన్ని తిరుచ్చి రాతి కోట పైన విజయనగర సామ్రాజ్య రాజులు నిర్మించారు. ఈ దేవాలయం కొండపై నుండి కావేరీ నది మనోహరమైన వాస్తుశిల్పం మరియు అందమైన దృశ్యాన్ని ప్రసిద్ధి చెందింది గా చెబుతున్నారు.
వినాయక నవరాత్రి సమయంలో ఈ దేవాలయంలో దర్శించుకుంటే మీకు మీ కుటుంబానికి మంచి జరుగుతుందని పండితులు చెబుతున్నారు.
Related Posts
పురాణాల ప్రకారం ఈ సూత్రాలు పాటిస్తే ఆయురారోగ్యాలు పక్కా!16 Sutras for Good Sleep & Health
https://hariome.com/worshiping-in-this-temple-salvation-from-kaal-sarp-dosh-shani-sade-sati/
శ్రీ మహావిష్ణువు లాగే వినాయకుడు కూడ అవతారాలు ఎత్తాడా?! వాటి చరిత్ర ఏమిటి?! | Incarnation of Ganesha
https://hariome.com/ganesh-chaturthi-lord-vinayaka-has-special-grace-zodiac-signs/