
హనుమంతుని ఎన్నో రూపాలను చూస్తుంటాం. పంచముఖ హనుమంతుడనీ,సప్త ముఖ హనుమంతుడనీ, బాల హనుమంతుడనీ, ధ్యానాంజనేయుడనీ ఇలా ఎన్నో రకాల రూపాలతో ఆంజనేయుని ఆలయాలు నిత్యం దర్శిస్తాం. కానీ హనుమంతుడు తనకు తానుగా ఒక యంత్రానికి బద్ధుడై, యంత్ర స్వరూపంగా దర్శనమిచ్చే అరుదైన ఆలయం యంత్రోద్ధారక హనుమంతుని గుడి.
1. అసలు ఎవరు ప్రతిష్టించారు ఈ యంత్రాన్ని..?
మధ్వసాంప్రదాయానికి కర్ణాటక ప్రాంతం పుట్టినిల్లు. 15వ శతాబ్దం లో సాళ్వనరసింహరాయల పరిపాలనాకాలం లో వ్యాసరాయరు అనే ఒక గొప్ప తాత్వికుడు, మధ్వాచార్యుడు, హనుమద్భక్తుడు ఉండేవాడు. అతను భారతదేశమంతటా సంచరించి 732 హనుమంతుని ఆలయాలను ప్రతిష్టించాడు. వాటిలో మొదటిది తుంగభద్రాతీరాన హంపి దగ్గర గల చక్రతీర్థం లోని ఈ యంత్రోద్ధారక హనుమంతుని ఆలయం.
Promoted Content