
Yaganti Temple
1యాగంటి దేవాలయం
ఆంధ్ర ప్రదేశ్ లోనే కాదు భారత దేశంలోని ప్రసిద్ద పుణ్యక్షెత్రాలలో ఒకటి యాగంటి దేవాలయం. ఈ క్షేత్రంలోనే శ్రీమద్ విరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామి కాలజ్ఞానాన్ని రచించారు. అంతటి మహోన్నతమైన చరిత్ర కలిగిన ఈ మహా పుణ్యక్షేత్రం 15వ శతాబ్దంలో విజయనగర సామ్రాజ్య పాలకులు అయిన సంగమ వంశానికి చెందిన హరిహర బుక్క రాయలుచే నిర్మింపబడింది. ఈ క్షేత్రంలో కాకి తిరగదు అని ఆలయ అర్చకులు తెలుపుతున్నారు. ఉమ్మడి కర్నూలు జిల్లా బనగానపల్లె మండలంలో కొలువై ఉన్న యాగంటి ఉమామహేశ్వర స్వామి ఆలయం చాలా ప్రత్యేకమైనదిగా చెప్పుకోవచ్చు.
యాగంటి దేవాలయం కథ (Yaganti Uma Maheswara Swamy Temple History)
కొన్ని వందల సంవత్సరాలకు పూర్వం దక్షిణ భారతదేశం యాత్రలో భాగంగా దక్షిణం వైపు వెళ్తున్న అగస్త్య మహర్షి వారు బనగానపల్లికి 10 కి.మీ.ల దూరంలో ఉన్న దట్టమైన నల్లమల ఆడవి కొండల మధ్య శ్రీ వేంకటేశ్వర స్వామి ఆలయాన్ని వైష్ణవ పద్ధతిలో నిర్మించారు. ఆలయంలో వెంకటేశ్వర స్వామిని ప్రతిష్టించేందుకు తయారు చేస్తున్న వేంకటేశ్వర స్వామి విగ్రహాన్ని చెక్కుతున్న సమయంలో స్వామి వారి విగ్రహం యొక్క బొటన వేలు విరిగిపోయింది. ఎందుకు అవయవలోపం జరిగింది అని తెలుసుకొనేందుకు అగస్త్యు మహర్షి ఘోరమైన తపస్సు చేశాడు. దీంతో అగస్త్య మహర్షి తపస్సుకు మెచ్చిన పరమ శివుడు ప్రత్యక్షమై విగ్రహానికి నష్టం కలిగిందని చింతించవద్దని ఈ ప్రాంతం తన కైలాశాన్ని పోలి ఉన్నందున తానే ఈ యాగంటి ప్రాంతంలో కొలువుదీరుతానని చెప్పి ఉమామహేశ్వర స్వామిగా యాగంటి క్షేత్రంలో వెలిశాడు. దీంతో అగస్త్యుడు వెంకటేశ్వర స్వామి విగ్రహాన్ని ఆలయం పక్కనే ఉన్న ఓ కొండ గుహలో పెట్టి ఉమా మహేశ్వర స్వామి విగ్రహాన్ని ఆలయంలో ప్రతిష్టించాడు. ఈ విగ్రహాన్ని ప్రతిష్టించిన కొన్ని రోజుల తర్వాత చిన్న నంది విగ్రహం స్వయంభూగా వెలిసినట్లు ఇక్కడి స్థల పురాణాలు చెబుతున్నాయి. ఇలా స్వయంగా వెలసిన నంది విగ్రహమే అంతకంతకు పెరుగుతూ ఆలయంలో ఉన్నటువంటి మండపాన్ని ఆక్రమించేసుకుంది.
ఆ నందీశ్వరుడే కలియుగాంతమున రంకేస్తాడని, ఆ అరుపులకు సగం మంది జనాలు చనిపోతారని శ్రీమద్ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి వారి కాలజ్ఞానంలో ఉంది. అంతేకాదు తిరుపతిలో కొలువైన శ్రీ వెంకటేశ్వర స్వామి కంటే ముందే యాగంటి క్షేత్రంలో వెంకటేశ్వర స్వామి విగ్రహాన్ని ప్రతిష్టించినట్లు చరిత్ర చెబుతోంది.
యాగంటి ఆలయంలో ఉత్సవాలు (Festivals Celebrated at Yaganti Temple)
ఈ ఆలయం మహా శివరాత్రిని జరుపుకుంటుంది మరియు ఈ సమయంలో చాలా మంది భక్తులు ఆలయాన్ని సందర్శిస్తారు.
యాగంటి ఆలయ సమయాలు (Temple Timings of Yaganti Temple)
ఉదయం: 06.00 AM – 01.00 PM.
సాయంత్రం: 03.00 PM – 08.00 PM.
గుహల ప్రవేశం : ఉదయం 07:00 నుండి సాయంత్రం 05:00 వరకు
యాగంటి ఆలయంలో సేవ మరియు టిక్కెట్ ధర (Sevas And Ticket Cost In Yaganti Temple):
వివాహ కట్టడి: Rs 500
అభిషేకం: Rs 100
ప్రత్యేక దర్శనం, స్పర్శ, అర్చన: Rs 50
ఆకాశ దీపం: Rs 400
ఏకాదశి రుద్రాభిషేకం: Rs 1116
మహాన్యాస పూర్వక రుద్రాభిషేకం: Rs 750
లఘున్యాస పూర్వక రుద్రాభిషేకం: Rs 250
వాహన పూజ (Vahana / Vehicle Pooja at Yaganti Uma Maheswara Swamy Temple)
ద్విచక్ర వాహనాలు: Rs 50
నాలుగు చక్రాల వాహనాలు: Rs 100
యగంటి క్షేత్రానికి వెళ్లే మార్గం: (Ways to Reach Yaganti Temple)
కర్నూలు నుంచి నంద్యాల పట్టణానికి వెళ్లే మార్గం మధ్యలో 55 కిలోమీటర్ల దూరంలో పాణ్యం అనే ఊరు నుంచి కుడి వైపుకు 25 నుంచి 30 కి.మీ.ల దూరంలో ఉన్న బనగానపల్లెను చేరుకోవాలి. ఇక్కడి నుంచి 15 కి.మీ.ల దూరంలో యాగంటి పుణ్యక్షేత్రం ఉంటుంది. మరో మార్గం కర్నూల్ నుంచి 50 కి.మీ.ల దూరంలో బేతంచెర్ల అనే ఊరు వస్తుంది, అక్కడి నుంచి బనగానపల్లె 20 కి.మీ.ల దూరం ఉంటుంది. ఇక్కడి నుంచి కుడి వైపుగా 15 కి.మీ.లు ప్రయాణిస్తే యాగంటి క్షేత్రానికి చేరుకోవచ్చు.
Related Posts
శిరస్సు లేని అమ్మ వారు! ఆ స్థానంలో ఏముంటుందంటే?! Erukumamba Temple Visakhapatnam
వారణాశిలో 12 రహస్య దేవాలయాలు | 12 Secret Temples of Varanasi
శ్రీ నూకాంబిక అమ్మవారి ఆలయ పునర్నిర్మాణం | Rebuilt Anakapalli Nookambika Temple
తిరుమలలో భద్రతపై టీటీడీ కీలక నిర్ణయాలు?! ఇక నుంచి భక్తులు ఖచ్చితంగా పాటించాల్సిందే! | TTD Updates
శని కష్టాలు పోయి అదృష్టం కలగాలంటే ఈ పదార్ధంతో పరిహారం ఇలా చేయండి! | Black Pepper Remedy For Shani
https://hariome.com/rohini-nakshatra-guru-pushya-nakshatra/
ఇలా చేస్తే 7 జన్మాల పాపాలు పోయి శాశ్వతమైన పుణ్యం లభిస్తుంది! | Hindu Beliefs
ఇంట్లో ఏ జంతువుల విగ్రహాలను పెట్టుకోవాలి? వాటి ఫలితాలు ఏమిటి? Which Animal Idols can we keep House?
ఈ చెట్టును పూజిస్తే సంతాన ప్రాప్తి మరియు స్వర్గానికి వెళ్తారు! | Gaya Banyan Tree Worship & Results
దేవుడికి ఏ పండ్లు నైవేద్యంగా పెడితే ఎలాంటి ఫలితం వస్తుంది? | Which Fruits are Offered to the God