
Why Sri Venkateswara Swamy Abhishekam on Friday?
1శ్రీ వెంకటేశ్వర స్వామికి అభిషేకం శుక్రవారమే ఎందుకు చేస్తారు?!
తిరుమలలో వారంలో ఒక్క రోజు మాత్రమే స్వామి వారికి అభిషేకం చేస్తారు. స్వామి వారి అభిషేకం అనేది చాలా పెద్ద కార్యం. ఎందుకంటే స్వామి వారు ధరించన తిరు ఆభరణాలు అన్ని తీసివేయాలి, పచ్చకర్పూరం నామం కూడా తీసేయాలి. తర్వాత స్వామి వారికి పూనుకు తైలం ఒళ్ళు అంత పూస్తారు. తర్వాత మాత్రమే స్వామి వారికి అభిషేకం చేయాలి. అభిషేకం పూర్తి అయిన తర్వాత స్వామి వారికి తిరిగి అలంకారం చేయాలి. ఇలా రోజు చేయాలి అంటే చాలా సమయం పడుతుంది కాబట్టి కేవలం శుక్రవారం మాత్రమే చేస్తారు. శుక్రవారం అమ్మవారికి ఇష్టమైన రోజు. స్వామి వారి వక్షస్థలంలో వ్యూహ లక్ష్మి ప్రత్యేక స్థానంలో (వక్ష స్థలం) ఉంటారు. అందుకే శ్రీనివాసుడు అనే పేరు వచ్చింది. అందుకే అమ్మవారి విగ్రహం ఎక్కడ ప్రత్యేకంగా లేదు. స్వామి వారిది ఏక బింబం. అందుకే స్వామివారికి శుక్రవారం చేస్తే లక్ష్మీ ప్రదంగా ఉంటుంది కాబట్టి ఆ రోజున చేస్తారు.
స్వామి వారికి అభిషేకం ఎంత సేపు చేస్తారు?! (How Long Does Abhishekam Done To Sri Venkateshwara Swamy?!)
శుక్రవారం రోజున దర్శనం చేసుకున్న వారికి లక్ష్మీ కటాక్షం కలుగుతుంది అని భక్తుల నమ్మకం. స్వామి వారికి అభిషేకం ఒక్క గంట సేపు ఉంటుంది, 4.30 AM – 5.30A.M వరకు ఉంటుంది. తర్వాత 15 నిమిషాల పాటు స్వామి వారి అలంకారం ఉంటుంది. పట్టు వస్త్రం, శిరోవస్తారం, వడ్డాణం అలకారం చేసినా తర్వాత స్వామి వారికి వెన్న నైవేద్యం అవుతుంది. తర్వాత స్వామి వారికి పచ్చ కర్పూరంతో హారతి ఇస్తారు. నిజ పాద దర్శనం అయిపోయిన తర్వాత తలుపులు మూసి సమర్పణ చేస్తారు, దీనికి ఒక్క గంట సేపు సమయం.
Related Posts
పురాణాల ప్రకారం ఈ సూత్రాలు పాటిస్తే ఆయురారోగ్యాలు పక్కా!16 Sutras for Good Sleep & Health
https://hariome.com/worshiping-in-this-temple-salvation-from-kaal-sarp-dosh-shani-sade-sati/
శ్రీ మహావిష్ణువు లాగే వినాయకుడు కూడ అవతారాలు ఎత్తాడా?! వాటి చరిత్ర ఏమిటి?! | Incarnation of Ganesha
https://hariome.com/ganesh-chaturthi-lord-vinayaka-has-special-grace-zodiac-signs/
దిష్టి తగలకుండా ఉండాలంటే మీ ఇంట్లో గణపతిని ఇలా పెట్టుకోండి.| Shubha Drishti Ganapathi
వినాయక చవితి పూజలో వాడే 21 పుజా పత్రాలు & విశిష్ఠత | Vinayaka Chavithi 21 Patri Names in Telugu