
Where is the Real Human Head of Ganesha Cut Off by Lord Shiva?
3గణేశుడి మనిషి రూపంలో ఉండే తల గురుంచిన కథ (Lord Ganesha Human Head Story)
కాని పార్వతి దేవి స్నానం చేసిన చోటు, శివుడు కైలాసం నుంచి వచ్చి గణేశుడి తల నరికిన చోటు ఎక్కడ ఉందో చాల మందికి తెలియదు. ఇది తెలిస్తే మీరు అశ్చర్యపోతారు. శివుడు స్వయంగా నడిచిన నేల, బాల గణేశుడికి శివుడికి యుద్దం జరిగిన ప్రదేశం ఎక్కడో తెలుసా? ఉత్తరాఖండ్ లోని పాతాళ్ భువనేశ్వర్ (Patal Bhuvaneshwar Cave Temple) అనే గుహ దగ్గరే ఈ కథ అంతా జరిగింది. ఈ గుహ మొత్తం సున్నపు రాయితో ఉంటుంది. ఇక్కడికి పర్యాటకులు చాల మంది వస్తుంటారు. ఈ గుహలోకి కొద్ది దూరమే అనుమతి ఉంటుంది. అది దాటి మనవమాత్రులు ఎవరు పొలేనంత భయంకరంగా ఉంటుంది. అలా వెళ్తే పాతాళ లోకం వస్తుంది అని నమ్మకం. ఈ గుహలో భయంకరమైన పాములు, జంతువులు ఉంటాయి కాబట్టి దీని చివర వరకు ఎలా ఉంటుందో ఎవరికి తెలియదు. కాని పార్వతి దేవి స్నానం చేసిన అందమైన మరియు అతి పవిత్రమైన కొలను ఈ గుహలోపలే ఉంది. ఈ కొలను పక్కనే పార్వతి దేవి గణేశుడి బొమ్మ తయారు చేసి ప్రాణం పోసింది. పితోరాఘర్ జిల్లాలోని (Pithoragarh District) గంగోలిహత్ (Gangolihat) కి 14 కిలో మీటర్ల దూరంలో ఈ పాతళ గుహ ఉంది. కైలసం తర్వత శివుడి ఇష్టమైన ప్రదేశం ఇదే అని చెబుతారు. శివపార్వతులు ఈ గుహలోనే ఎక్కువగా ఏకంతంగా గడిపేవారంట. ఈ గుహ లోపలికి దేవతిదేవతులు కూడ వెళ్ళలేరంట. ఆ దేవ దేవుడి అనుగ్రహం ఉంటే తప్ప లోనికి వెళ్ళలేరంట. మరిన్ని వివరాల కోసం తరువాతి పేజీలో చూడండి.