3. తోటలో ఏం జరిగింది
దేవయ్య పండ్లను దొంగిలించడానికి తోటలోకి ప్రవేశించి నిండుగా పళ్లున్న ఒక చెట్టుపైకి ఎక్కాడు. సరిపడా పండ్లను కోసుకున్నాక అతనిలో అత్యాశ మేల్కొంది. తాను మోయలేనన్ని పండ్లను కోశాడు దేవయ్య. ఎక్కువ పండ్ల కోసం చెట్టు పైభాగానికి ఎక్కాడు. కానీ అక్కడినుండీ దిగడానికి అతనివల్ల కాలేదు. తాను ఎక్కిన కొమ్మనుంచీ జారి మరోకొమ్మకు వెళ్లాడాడు. అతను నేలకి చాలా ఎత్తులో ఉన్నాడు. అక్కణ్ణుంచీ పడడం చాలా ప్రమాదకరమని గ్రహించాడు. అటునుంచీ ఏనుగుపై వెళుతున్న ఒక మావటిని పిలిచి తనకు సాయం చేస్తే తన వద్ద ఉన్న పండ్లలో సగం ఇస్తానని మావటిని ప్రార్థించాడు.
Promoted Content