
vishnu sahasranamam
3. గీతా రహస్యము
బ్రహ్మవిద్య నధ్యయనము చేయువారిని బాబా యెల్లప్పుడు ప్రేమించువారు, ప్రోత్సహించువారు. ఇచట దానికొక యుదాహరణమిచ్చెదము. ఒకనాడు బాపుసాహెబుజోగ్ కు ఒక పార్సెలు వచ్చెను. అందులో తిలక్ వ్రాసిన గీతారహస్య ముండెను. అతడా పార్సిలును తన చంకలో పెట్టుకొని మసీదుకు వచ్చెను. బాబాకు సాష్టాంగనమస్కారము చేయునప్పు డది క్రిందపడెను. అదేమని బాబా యడిగెను. అక్కడనే దానిని విప్పి బాబా చేతిలో ఆ పుస్తకము నుంచెను. బాబా కొన్ని నిమిషములు పుస్తకములోని పేజీలను ద్రిప్పి తన జేబులోనుండి ఒక రూపాయి తీసి పుస్తకముపై బెట్టి దక్షిణతో గూడ పుస్తకమును జోగున కందించుచు “దీనిని పూర్తిగ చదువుము, నీకు మేలు కలుగును.” అనెను.
ఇది సాయీ సచ్చరిత్రము లోని విష్ణుసహస్ర నామ కథ.. వైకుంఠ ఏకాదశి (భీష్మ ఏకాదశి) నాడు బాబాను తలచుకొని, విష్ణుపారాయణ మహత్యాన్ని తెలుసుకొని ధన్యులమవుదాం.
సదా నింబ వృక్షస్య మూలాధివాసాత్
సుదాస్రావిణంతిక్త మప్య ప్రియంతం
తరుం కల్పవృక్షాధికమ్ సాధయంతం
నమామీశ్వరం సద్గురుం సాయినాథమ్.