
Nine Ways Of Devotions in Telugu
6. అర్చనము
హిందువులకి సగుణరూపంలో (ఫొటో,విగ్రహం) భగవంతుడ్ని అర్చించాలనే నియమం విధించబడింది….కృతయుగంలో విగ్రహారాధన లేదు..గురుశిష్య పరంపర కొనసాగిన కాలం అది…త్రేతాయుగంలో రాముడు,ద్వాపరయుగంలో కృష్ణుడు గురువులని ఆశ్రయించారు..కానీ క్రమంగా సామాన్యులు గురువులని, మహాత్ములని దూరం చేసుకోవటం వల్ల…మనకి భగవంతుడు దూరమయ్యాడు, అదీకాక కలియుగంలో ప్రతివీధిలోనూ ఓ గురువు వెలుస్తాడు…సద్గురువు ఎవరో తెలుసుకునే ఙ్ఞానం అల్పులైమైన మనకి ఉండదు కాబట్టి.. ఋషులు ఇది ముందుగా గ్రహించి మనకి విగ్రహారాధన అలవాటు చేసారు.మనం ఓ సద్గురువుని ఆశ్రయించి ఈ ఆరాధన సక్రమంగా చేస్తూ..పారాయణలు,వ్రతాలు చేస్తూ..వారి అనుగ్రహాన్ని పొందితే వారు మన బాధ్యత తీసుకుంటారు.
Promoted Content