
Nine Ways Of Devotions in Telugu
5. పాదసేవనము
మహాత్ముల పాదాలెందుకు సేవించాలంటే బ్రహ్మఙ్ఞానం పొందిన మహాత్ములు భగవంతునితో ఐక్యమై ఉంటారు. అలా ఐక్యమై భగవంతుని పాదాలచెంత తమ జీవితంలో సర్వస్వమూ అర్పిస్తారు. సామాన్యంగా జనాలు ఎదుట వారిని ముఖం చూచి పోల్చుకుంటారు, కానీ ఋషీశ్వరుల ముఖం (అహం) ఇక్కడ ఉండదు, భగవంతుని చెంత ఉంటుంది(ఐక్యమైవుంటుంది).జనాలిక్కడ ఆయన పాదాలనే (ఆచరణ) కనుగొంటారు.అందుచేత ఆయన పాదాలకి నమస్కరించాలి. పాదసేవనం అంటే పాదాలను కౌగలించుకోవటం, ముద్దడటమో, పాదాల చెంత తలను వాల్చడమో కాదు. ఆయన అనుసరించి చూపిన మార్గంలోనే నడవటం. ఆయన చెప్పిన వాటిని ఆచరించి చూపించడం.
Promoted Content