
Must Visit This Temple If You Are Trying to Conceive
2Sri Valli Devasena Subramanyeswara Swamy Temple Details
1. కాకినాడ సమీపాన ఉన్న ఎస్ అన్నవరం గ్రామంలో, గాయత్రి నగర్ లో స్వయంభు శ్రీ సుబ్రహ్మణ్యస్వామి వెలిశారని గుడి నిర్వాహకులు తెలియజేశారు.
2. ఇది ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో ఉంది.
3. శ్రీ లక్ష్మీ గాయత్రీ దివ్య శక్తి మందిరంలో ముందుగా ఒక సర్పం కనిపించింది.
4. తరువాత ఒక పుట్ట స్వయంభుగా వెలిసింది.
5. మొదట చీమల పుట్ట అనుకుని గుడి నిర్వాహకులు ఆ ప్రాంతాన్ని శుభ్రపరిచిన పరిస్థితి కూడా ఉంది.
6. అక్కడ సుబ్రమణ్య స్వామి ఉన్నారని భక్తులకు తెలియడం, స్వయంగా కొన్నిసార్లు భక్తులు నాగేంద్రుని దర్శించడంతో భక్తులు పెద్ద ఎత్తున విశేష పూజ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు.
7. ముఖ్యంగా సుబ్రహ్మణ్య షష్టి, నాగుల చవితి వంటి ముఖ్య పర్వదినతో పాటు ప్రతి మంగళవారం నాడు పుట్టలో పాలు పోసి నాగేంద్రుడు కు ప్రత్యేక ఆరాధన చేస్తూంటారు.
8. ఇక్కడ ప్రధానంగా వివాహం కాని వారు, సంతానం లేనివారు సుబ్రహ్మణ్యస్వామికి పాలు పోసి ఇక్కడి పుట్ట మట్టి తీసుకెళ్లి నుదుటిన పెట్టుకునే స్వామి వారి అనుగ్రహంతో వారి కోరికలు తప్పక తీరుతాయని ఆలయ నిర్వాహకులు ఎంతో విశ్వాసంతో పేర్కొంటున్నారు.
9. ఆలయ నిర్వాహకులు చెప్పినట్లు ఇక్కడ పుట్టలు ఎంతో నిండుగా ఆకట్టుకుంటూ ఉంటాయి.
10. ఒకదాని పక్కన మరొకటి పక్కపక్కన 11 కు పైగా పుట్టలు, వాటికి వర్షం పడినప్పుడు ఇబ్బంది కలగకుండా పైన షెడ్ కూడా ఆలయ నిర్వహకులు నిర్మించారు.
11. ఆ ప్రాంతం స్వయంభు పుట్టలుగా ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలోని ప్రత్యేకంగా పేరుగాంచాయి.
12. స్వప్నంలో కనిపించి నాగేంద్ర తనే స్వయంభుగా 11 అడుగుల లోతులో వెలిసినట్లు తెలియజేశారు.
13. నాగేంద్రుడు చెప్పినట్లు రాను రాను ఒక పుట్ట కాస్త 11 పుట్టలుగా మారాయి.
14. ఆ పుట్టలో నుండి ఒక సర్పం బయటకు వచ్చి ఆ గోడపై కనిపించడంతో స్వామి వారి దయా కటాక్షం అంటూ ప్రత్యేక ఆలయాన్ని నిర్మించారు.
Hindu Temples Guides Related Posts
అరుణాచలంలో శివలింగానికి దగ్గరగా ఉంటే ఏం జరుగుతుందో తెలుసా..?