
4. అధిక రుతుస్రావానికి
అశోక మాను బెరడు 80 గ్రా , నాటు ఆవుపాలు 80 గ్రా , మంచి నీరు 320 గ్రా తీసుకోవాలి . చెక్కని కడిగి నలగగొట్టి రసం తీయాలి . ఆ రసం , ఆవుపాలు , నీరు అన్ని కలిపి పొయ్యి మీద పెట్టి నీరు ఇగిరిపొయే వరకు మరిగించి మిగిలిన కషాయాన్ని వడపోసుకొని మూడు మోతాదులుగా మూడు పూటలా కొద్దిగా పటికబెల్లం కలిపి సేవించాలి .
ఇది సేవించేప్పుడు కారం, ఉప్పు , పులుపు, మాంసం , గుడ్లు, చేపలు వంటి పదార్దాలు సేవించ కూడదు . చప్పిడి పథ్యం ఖచ్చితంగా పాటించాలి. ఇలా చేస్తుంటే అధిక రుతురక్తం ఆగిపొతుంది. అంతే కాక గర్భాశయం లొని ఇతర సమస్యలు కూడా నివారించ బడతాయి.
గర్భం రాని వంధ్యా స్త్రీలకు ఈ కషాయ సేవన వలన గర్భశయ శుద్ది జరిగి సంతాన ప్రాప్తి కలుగుతుంది.
Promoted Content