
TSRTC Tirumala Tour Package
1టీఎస్ఆర్టీసీ తిరుమల టూర్ ప్యాకేజీ
తిరుమల అంటేనే భక్తుల రద్దీతో హరి నామ స్మరణతో ఆ ఏడు కొండలు మార్మోగుతాయి. శ్రీవారిని దర్శించుకోవడానికి ఏన్నో రోజుల ముందు ప్రణాళికలు వేసుకోవాలి అంటే టికెట్లు బుక్ చేసుకోవాలి, గదులు బుక్ చేసుకోవాలి, రైలు లేక వాహానాలను బుక్ చేసుకోవాలి ఇలా చాలా తతంగం ఉంటుంది. కాని కోందరికి అనుకోకుండ దర్శనం చేసుకోవాలంటే కష్టమే. టికెట్లు దొరకని వారు తిరుమలకు వెళ్లి అక్కడ నేరుగా టైమ్ స్లాట్ సర్వ దర్శనం టికెట్లు పొందవచ్చు. కానీ దీనికి కూడా ఐదారు గంటల సమయం పడుతుంది. మరీ ఎలా?
ఎలాంటి టోకెన్, టికెట్ లేకుండా కూడా తిరుమల శ్రీవారిని దర్శించుకోవచ్చు. అది ఏలా అంటే, ప్రభుత్వ బస్సుల్లో తిరుపతికి వెళ్తే బస్సు టికెట్తో పాటు శ్రీవారి దర్శనం టికెట్లను కూడా పొందవచ్చు. ఏపీఎస్ఆర్టీసీతో పాటు టీఎస్ఆర్టీసీ కూడా ఈ టికెట్లను అందజేస్తోంది. తెలంగాణలోని ప్రధాన నగరల నుంచి తిరుపతికి టీఎస్ఆర్టీసీ ఏసి మరియు నాన్ ఏసి బస్సులు నడుపుతోంది. ప్రతి రోజు వెయ్యి పైగా ప్రయాణికులకు రూ.300 శీఘ్ర దర్శన టికెట్లు అందుబాటులో ఉంటాయి. ఈ సౌకర్యాన్ని భక్తులు వినియోగించుకోవాలని కోరారు. ఈ టికేట్ ఏలా పొందాలో తెలుసుకోవడం కోసం తరువాతి పేజీలో చూడండి.