
నిజమైన నైవేద్యం (ఈ రోజు కధ) | True offering to God
మనం భగవంతునికి నైవేద్యం పెట్టడానికి రకరకాల వంటలు చేస్తాం. భగవంతుడు సర్వవ్యాపకుడని అంగీకరిస్తాం. కానీ ఆకలంటూ ఎవరైనా వచ్చినప్పుడు అన్ని జీవులలోనూ ఉన్న భగవంతుని గుర్తించము. ఆ కనువిప్పు కలిగించే చక్కని కథ తెలుసుకుందాం.
2. ఋషులకు బ్రహ్మచారికీ జరిగిన సంభాషణ
ఇది యాగ ప్రసాదం ఎవరికి పడితే వారికి ఇవ్వబడదు అన్నారు. అప్పుడా బ్రహ్మచారి ‘స్వామీ మీరు యే దేవునికి యాగం చేశారు’ అని అడిగాడు. అప్పుడా ఋషులు మేము వాయుదేవుని అనుగ్రహం కొరకు యాగం చేస్తున్నాము.’ అన్నారు ఆ ఋషులు గర్వంగా. ‘వాయుదేవుడంటే ప్రాణవాయువు కూడా కదూ ‘ ,’ అంటే ఆయన అన్ని ప్రాణులలోనూ ఉండే ప్రాణశక్తే కదా..’అన్నాడా బ్రహ్మచారి. ‘అవునయ్యా.. ఆవిషయాలు మాకు తెలుసు నీవిక వెళ్లవచ్చు’ అన్నారు ఋషులు. ‘అయితే స్వామీ మరి మీరు సమర్పించే ఆ నైవేద్యం ఎవరికి?’ అని అడిగాడు బ్రహ్మచారి. ‘ప్రాణ స్వరూపునికి నాయనా..!ఇంకెవరికి?’ అన్నారు ఋషులు. అప్పుడా బ్రహ్మచారి నవ్వి ‘ప్రాణ శక్తి అయినటువంటి ఆ వాయుదేవుడు ప్రాణమున్న అన్నీ జీవులలోనూ ఉంటాడు కదా’ , ‘అవును ఉంటాడు’ ‘మరి అన్నీ జీవులలోనూ ఉన్న ప్రాణ శక్తి నాలోనూ ఉంది కదా’ , ‘అవును’ అన్నారు ఋషులు అయోమయంగా. అప్పుడా బ్రహ్మచారి ‘అయ్యా యే ప్రాణశక్తి స్వరూపుడైన వాయుదేవునికైతే మీరు నైవేద్యాన్ని సమర్పించారో, ఆ వాయుదేవుడు నాలోనూ ప్రాణశక్తిగా ఉన్నాడు. మరి వాయుదేవుడు కొలువై ఉన్న ఈ శరీరాన్ని నిలబెట్టుకోడానికి నేను భిక్ష అడిగితే ఎందుకు నన్ను నిరాకరిస్తున్నారు?’ నన్ను నిరాకరించినా ఆ వాయుదేవుని నిరాకరించినట్లే కదా..! అన్నాడు. అప్పుడు ఋషులు తత్వాన్ని మరచిన పూజలు నిరర్థకం అని గ్రహించి, ఆ బ్రహ్మచారికి క్షమాపణలు చెప్పి అతనికి భోజనాన్ని పెట్టారు.
Nice story