పుట్ట రూపంలో పూజించే కలియుగ ప్రత్యక్ష దైవమైన శ్రీ వెంకటేశ్వర స్వామి | Tirumalagiri Sri Venkateswara Swamy Temple

0
2416
Tirumalagiri Sri Venkateswara Swamy Temple
Tirumalagiri Sri Venkateswara Swamy Temple

Tirumalagiri Sri Venkateswara Swamy Temple

2దేవాలయం స్థల పురాణం (Temple Story)

స్వామి వారిని పరీక్షించడం కోసం భృగు మహర్షి వారు స్వామి వారిని పాదములతో వక్ష స్థలంపై తంతారు. నిజానికి భృగు మహర్షి వారు లక్ష్మీ దేవికి తండ్రి సమానులు. భృగు మహర్షి వారు తన్నినా కూడ స్వామి వారు అవమానంగా భావించలేదు. కానీ అమ్మ వారు లక్ష్మీదేవి అవమానంగా భావించి వైకుంఠంను వీడి వెళ్ళిపోతారు.

లక్ష్మీ దేవి కోసం వెతికి వెతికి అలిసిపోయిన స్వామి వారు ఒక్క పుట్టలో సేద తీరుతారు. అప్పుడు ఆకలితో ఉన్న స్వామి వారికి గోవు రూపంలో ఉన్నా బ్రహ్మ దేవుడు వచ్చి పాలు ఇచ్చి ఆకలి తీరుస్తారు. ఈ ప్రాతంలోనే పుట్టలో స్వామి వారు సేద తీరారు కాబట్టి, భక్తుల కోసం ఈ పుణ్యక్షేత్రంలోనే పుట్ట రూపంలో స్వామి వారు దర్శనం ఇస్తారు.

పుట్టలో ఉన్నందున స్వామి వారికి అభిషేకాలు జరగవు. పుట్టలో రంధ్రాలు ఉండవలసిన చోట స్వామి వారి నామాలు దర్శనం ఇస్తారు, అందుకే నామాల వెంకటేశ్వర స్వామి అని పేరు కూడా ఉంది. ఇక్కడ కేవలం పగటి పూట మాత్రమే దర్శనానికి అనుమతి ఉంటుంది. చీకటి పడితే గుడిలో పూజారులు కూడా కొండ కిందకి రావాల్సిందే. మళ్ళీ సూర్యోదయం అయ్యే వరకు దర్శనం ఉండదు. ఎందుకంటే రాత్రి వేళల్లో కొండపై శ్రీ వేంకటేశ్వర స్వామి వారు సర్ప రూపంలో ఉంటారు అని నమ్మకం. అది చూసిన చాలా మంది భక్తులు చనిపోయారు, అందుకే రాత్రి వేళల్లో కొండపై భక్తులు సంచారాన్ని నిషేదించారు.

అలాగే రాత్రి వేళల్లో ముక్కోటి దేవతలు స్వామి వారికి అభిషేకిస్తారు అని నమ్మకం. ఎందుకంటే గుడి తెరిచే సమయానికి అభిషేకంజరిగిన నట్లుగా ఆ ప్రాంతం కనబడుతుందంటా. ఈ క్షేత్రంలో ఇంకో కూడ ప్రత్యేకత ఉంది, అది ఏమిటంటే వేసవి కాలంలో కూడా కొండపై నీళ్లు ఉంటాయి.