వేదనలు దూరం చేసే మందిరం | Temple That Removes the Agony in Telugu

0
8911
the-temple-that-removes-the-agony-hariome
 Temple That Removes the Agony in Telugu

అజరామరమైన ఇతిహాస భారతాన్ని భారతీయులకు అందించిన మహర్షి వేదవ్యాసుడు. కేవలం ఒక వౌనిగా, మహర్షిగా కాకుండా, అంతకు మించిన గౌరవం అందుకున్నవాడు.

విశ్వామిత్రుడు, వశిష్టుడు, వాల్మీకి ఎందరున్నా, వ్యాసుడు పొందిన ప్రాశస్త్యం ప్రత్యేకమైనది. అంతటి ప్రశస్తి పొందిన వేదవ్యాసునకు చిక్కమంగళూరు జిల్లా శృంగేరి నరసింహ వనంలో ప్రత్యేకంగా ఓ మందిరం వుంది.

తుంగ భ్రదా నది కుడి పక్కన అష్టకోణాకృతిలో నిర్మితమైన ఈ ఆలయం భక్తులకు కనువిందుచేస్తోంది. లోక కల్యాణకారుడైన మహర్షికి మందిరం నిర్మించిన కీర్తి కర్ణాటకదే.

మందిర అంకురార్పణ

వేద వ్యాసునకు మందిరం నిర్మించాలని ఆలోచనకు అంకురార్పణ చేసింది బెంగుళూరుకు చెందిన కుప్పాచారి కృష్ణమూర్తి.

ఆయన తన మదిలో రేగిన ఆలోచనను, తదనుగుణంగా రేగిన ఆకాంక్షను శృంగేరీ మఠ భారతీ తీర్థ స్వామీజీకి వివరించగా, ఆయన నరసింహ వనంలో వ్యాసఆలయ నిర్మాణానికి శ్రీకారం చుట్టారు. అలా వేదవ్యాస జ్ఞానపీఠ నిర్మాణం మొదలైంది.

శంకారా చార్యులచే నిర్మితమైన శృంగేరీపీఠం ఇక్కడి శంకర మఠం. ఈ నది ఒడ్డున ఉన్న ధ్యానమందిరాలు దర్శించినంతనే, ధ్యానంపైకి దృష్టిని మళ్లిస్తాయ.

తప్పక దర్శించవలసినవి

ఇక్కడ శారదాంబ మూర్తి చక్రశిలమీద తుంగానదికి ఎడమవైపు దర్శనం ఇస్తుంది. ఇక్కడ విద్యాశంకర దేవాలయం కూడా భక్తులను ఆకట్టుకుంటోంది.

ఈ స్థల మహాత్య్మం గురించి వర్ణించనలవి కాదని, సాక్షాత్తూ శంకరాచార్యులే పనె్నండు సంవత్సరాలు ఇక్కడ నివసించారని అంటారు.

ఎందుకు దర్శించాలి ?

నేటి సమాజంలో పెరిగి పోతున్న అన్యాయం, అహింసలను నిర్మూలించడం కేవలం సాధనవలనే సాధ్యమన్నది ఇక్కడి సాధకుల మాట.

ప్రతి ఒక్కరు సచ్చీలతను అలవర్చుకోవాలని, సత్యంతోనే దేనినైనా సాధించవచ్చు అని చెప్పే వేదవ్యాసులను అందరం నిత్యం స్మరించుకోవాలి అని ఆలయ నిర్మాణ కర్తలు చెప్తున్నారు.

చేరుకోవడానికి ఎలా?

తుంగానదికి చేరిన భక్తులు అక్కడున్న వంతెన దాటి నరసింహ వనంకు వెళ్లాలి. వంతెన గేటును సాయంత్రానికి మూసివేస్తారు కనుక ముందుగానే అక్కడికి చేరుకోవాల్సి ఉంటుంది.

మందిరానికి వెళ్లే మార్గ నిర్దేశనం లేదా నామఫలకాలు వంటివి ఇక్కడ కనిపించవు. ఇంత విశేషత కలిగిన మందిరం ఇక్కడ ఉన్నట్టు పక్కన వున్న పల్లెవాసులకు తెలియదు.

ఈ కారణంగా ఇక్కడ భక్తుల సంఖ్య పలచగానే ఉంటుందని ఆలయ ధర్మకర్తలు చెప్తుంటారు. అయతే వేదవ్యాసుడులాంటి మహాపురుషునికి ఆలయం నిర్మిస్తే చాలదని, ఆయన తెలియచెప్పిన మంచి విషయాలు సమాజానికి తెలియపర్చాల్సిన అవసరం కూడా వుందని వ్యాసభగవానుని భక్తుల భావన మరియు “హరి ఓం” భావన.
-పి.విజయనిర్మల

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here